Take a fresh look at your lifestyle.

ప్రజలు గాలి పీల్చుకోవాలన్న కేసీఆర్ అనుకుమతి కావాలేమో …జగ్గారెడ్డి

ప్రజాతంత్ర ,హైదరాబాద్ : తెలంగాణ రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.రైతును ఆదుకోవాలే కానీ, శాసించే హక్కు సీఎం కేసీఆర్ కి లేదన్నారు. శనివారం గాంధీభవన్ లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ….ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతు బందు అంటూ సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ఏం పంట వేయాలో, ఏం తినాలో నిర్ణయించే అధికారాం సీఎంకు ఎవరిచ్చారని ఇకనుంచి ప్రజలు గాలి పీల్చుకోవాలన్న సీఎం అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇచ్చే 5 వేల పై ఆధారపడి రైతు సాగు చేయడం లేదని సీఎం రైతుబంధు తప్పించుకునేందు షరతులు పెడుతున్నారని విమర్శించారు.ఇలా ఖండిషన్ పెట్టడం అంటే రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు .అధికారం లోకి వచ్చి ఇన్ని రోజులు అయిన లక్ష రూపాయలు ఋణ మాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు..ఇప్పటికే పెట్టుబడి లేక, లేబర్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఇప్పటవరకూ ప్రకృతి విపత్తుల వలన నష్ట పోయిన వారికి సాయం అందలేదని ఆరోపించారు..

Leave a Reply