- దిశ యాప్పై పూర్తి చైతన్యం కలిగించాలి
- మహిళలకు దిశ యాప్పై చైతన్యం కలిగించాలి
- అధికారులతో సక్షలో సిఎం జగన్ సూచనలు
అమరావతి, జూన్ 23 : మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం జగన్ ఆదేశించారు. సీతానగరం ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలు, మహిళల భద్రతపై ఆయన చర్చించారు. దిశ యాప్పై పూర్తి చైతన్యం కలిగించాలని, యాప్ ఎలా వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. మహిళల భద్రతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అధికారులతో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ’ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసేలా చూడాలి. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లతో వారికి అవగాహన కలిగించాలి. ముందుగా మహిళా పోలీసులకు, వలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్ను ఎలా ఉపయోగిం చాలన్న దానిపై అక్క చె•-లలెమ్మలకు చెప్పాలి. దీన్ని ఒక డ్రైవ్గా తీసుకోవాలి. కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్ వినియోగంపై అవగాహన కలిగించాలి. ఈ చర్యల వల్ల దిశ యాప్ వినియోగం పెరుగుతుంది.
అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆ మేరకు వెనువెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలి. దిశ పోలీస్స్టేషన్లు, స్థానిక పోలీస్స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలి. పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చాలని తెలిపారు. ఈ సమావేశానికి •ంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం •ంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరిం చాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం సుచరిత డియాతో మాట్లాడారు.
దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్ పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిలో వలంటీర్లు, మహిళా పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశా యాప్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల న్నారు.పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. సీతానగరం ఘటనలో అనుమానితులను గుర్తించామని… త్వరలోనే డియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. నిర్మానుష్యప్రాంతంలో జరగడంతో అనుమానితులను గుర్తించడం కష్టంగా మారింది. అయినా బాధితురాలి సహకారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.