ఖమ్మం సిటి, జూలై 30 (ప్రజాతంత్ర విలేకరి) పురపాలిక సంఘాల పరిధిలో పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుద్యం వంటి కనీస అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు తెలంగాణ పురపాలక శాఖా మంత్రి కెటిఆర్ దిశానిర్దేశం చేసారు. గురువారం హైద్రాబాద్లో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలసి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించాల్సిన పనులు, కొనసాగుతున్న పనులు, మున్సిపాలిటీల అభివృద్దికి, చేయాల్సిన పనులపై అభివృధ్ది ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి కెటిఆర్ పేర్కోన్నారు.
సిఎం కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయా)న్నారు. ప్రజలు ప్రాధమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని వివరించారు. ప్రజలు ప్రాధమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని వివరించారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను కచ్చితంగా అమలు జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎంవి రెడ్డి, మేయర్ పాపాలాల్, ఎంఎల్ఏలు సండ్ర వెంకటవీరయ్య, ఉపేందరరెడ్డి, హరిప్రియ, ఎంఎల్సి బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్చైర్మన్ లింగాల కమల్రాజ్,మున్సిపల్ కమీషనర్ అనురాగజయంతి పాల్గొన్నారు.