- నివారణలో సర్పంచ్లంతా కథనాయకులు కావాలి
- పంచాయితీరాజ్ దినోత్సవం
- సందర్భంగా సర్పంచ్లతో ప్రధాని మోదీ
ప్రతి ఒక్కరూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగేలా కొరోనా గొప్ప గుణపాఠం నేర్పిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్శాఖ ఎంతో కృషి చేస్తోందని, పంచాయతీ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచు లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కొరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కొరోనా నివారణకు కృషిచేస్తున్న సర్పంచులందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. మెరుగైన సేవలతో పురస్కారాలు పొందిన సర్పంచులను అభినందిం చారు. ఏటా మెరుగైన పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీలకు పురస్కారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించారు. కొరోనా సంక్షోభ సమయంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందుబాటులో ఉంచాలని సర్పంచులకు సూచించారు. విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టాలన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాండ్ బ్యాండ్ సేవలు అందుతున్నాయని ప్రధాని తెలిపారు. మహమ్మారి మనకు గొప్ప గుణపాఠం నేర్పిందని, కష్టం సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండటం ఎలాగో ప్రతి ఒక్కరికీ తెలిసొచ్చేలా చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై గ్రామ ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాలని సర్పంచుకులకు సూచించారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ను ప్రధాని ప్రారంభించారు. అలాగే కొరోనా కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించడం పై చర్చించారు. కరోనాపై ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. వైరస్ ఎన్నో పాఠాలు నేర్పిందని మోదీ చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో అందరూ ఆత్మనిర్భరంతో ఉండాలన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి వైరస్ను తరిమికొట్టాలని మోదీ పిలుపునిచ్చారు. పంచాయతీ వ్యవస్థ బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కరోనా వేళ గ్రాణ ప్రాంతాల ప్రజలు పట్టణ వాసులకు పాఠాలు నేర్పారని మోదీ అన్నారు. కరోనా గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ గ్రాణులు ఆదర్శంగా నిలిచారని ప్రధాని కొనియాడారు.