వరంగల్ క్రైం: ఒంటరిగా జీవితాన్ని గుడుపుతున్న వృద్ధ మహిళను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ వృద్ధాశ్రమంలో చేర్పించారు. నగరంలో జీవిస్తున్న పారిపెల్లి రాజమ్మ భర్త కొద్ది సంవత్సరాల క్రితం మరణించడం అదేవిధంగా కొద్ది రోజుల క్రితం కొడుకు సైతం మరణించడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ షాపు అరుగులపై నిద్రిస్తున్న రాజమ్మ స్థితిని గుర్తించి స్థానికులు సిపికి వివరించడంతో ఆమెను కమిషనరేట్కు తీసుకొచ్చి మహిళా హెడ్కానిస్టేబుల్ శ్రీలత ద్వారా పిఆర్వో మోహనకృష్ణ, కాజీపేట ఇన్స్పెక్టర్ నరేందర్లు అమ్మ వృద్ధాశ్రమంలో చేర్పించారు.
Tags: Orphaned, old woman, elderly home, rajamma, khazipet inspector