తాజాగా మరో 550 మంది మృత్యువాత
కొరోనా నుంచి బయటపడ్డ మంత్రి స్మృతి ఇరానీ
చికిత్స పొందుతూ బిజెపి ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే మృతి
న్యూఢిల్లీ,నవంబర్12:భారత్
దీంతో అప్పటి నుంచి ఆమె క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో తనకు కొరోనా నెగిటివ్గా తేలిందని ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. తాజాగా.. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా (50) కొరోనా వైరస్తో కన్నుమూశారు. కొరోనా వైరస్ బారినపడ్డ ఆయన ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. రెండు వారాల కిందట కొరోనా వైరస్ నిర్దారణ కావడంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ కి తరలించారు.చికిత్స పొందుతున్న జీనా ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో కన్నుమూ శారు. ఇంతకు ముందు సురేంద్రసింగ్ భార్య ధర్మాదేవి సైతం ఇటీవల కొరోనా బారినపడ్డారు. అదే సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సురేంద్రసింగ్ ప్రస్తుతం అల్మోరా జిల్లా స్టాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇదే స్థానం నుంచి ఆయన మూడుసార్లు విజయం సాధించారు. ఆయన మృతిపై బీజేపీ నేతలు దిగ్భ్రాతి వ్యక్తం చేశారు.