సుప్రీమ్ కోర్టు తీర్పు కు అనుగుణంగా మీరట్ నుంచి వచ్చిన ప్రత్యేక తలారి వీరు నలుగురికి ఉరి శిక్ష అమలు చేశారు. ఉరి అనంతరం దోషులను పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్లు తేల్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. అయితే నిర్భయ దోషులకు ఉరి తీసే ముందు.. వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు ఐదు నుంచి పది నిమిషాలు అనుమతివ్వాలని వీరి తరఫున ముందు నుంచి వాదిస్తున్న న్యాయవాది ఏపి. సింగ్ కోరారు. అయితే దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ఇందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు. ఇక సుప్రీం తీర్పు తర్వాత ఉరి శిక్ష పట్ల హర్షం నిర్భయ తల్లి ఆషాదేవి హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్షతో తన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరిందని ఆమె చెప్పారు.
నిర్భయ తండ్రి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకుఉరిశిక్ష అమలు చేసిన తీహార్ జైలు వద్ద స్థానికులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. నిర్భయదోషులకు ఉరిశిక్ష అమలు కావడంతో దేశవ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తం కాగా..నిర్భయ కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు ఉదయమే తిహార్ జైలు దగ్గర సంబరాలు చేసుకున్నారు నిర్భయ వర్థిల్లాలి, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కొందరు జాతీయ జెండా ప్రదర్శించారు. కాగా, నిర్భయ దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఉదయం 5:30 గంటలకు తీహార్ సెంట్రల్ జైలులోని జైలు నెంబర్ 3లో ఉరితీసిన సంగతి తెలిసిందే. ఇక జైలు వద్దకు చేరుకున్న వారిలో సామాజిక కార్యకర్త యోగితా భయానా కూడా ఉన్నారు. ’నిర్భయకు న్యాయం జరిగింది. మిగతా బాధితులకు కూడా న్యాయం జరగాలనే పోస్టర్ను ఆమె ప్రదర్శించారు.
నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. కష్టతరమైన యుద్ధంలో విజయం సాధించామని నిర్భయ కుంటుంబం సన్నిహితుడు అకాశ్ దీప్ అన్నారు. ఉరి శిక్ష నిర్ణయం, అమలు.. మంచిదే.. కానీ, శిక్ష అమలు ఇంతలా ఆలస్యం కాకుండా… ముందే జరగాల్సిందని దివ్యా ధావన్ అనే మహిళా అన్నారు. ’నిర్భయ దోషులకు ఉరి అమలుతో సమాజం ఏ మారదు. కానీ, నిర్భయకు న్యాయం జరిగింది. సంతోషం’అని సనా అనే యువతి తెలిపారు. ఇక దక్షిణాసియాలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఒకేసారి నలుగురికి ఉరితీయయం ఇదే తొలిసారి. తీహార్ జైలు 16 వేల మంది ఖైదీలకు కాగారారం కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఉరి అమలు నేపథ్యంలో జైలు వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుద్టిమైన భద్రత ఏర్పాటు చేశారు.