Take a fresh look at your lifestyle.

సమాజాన్ని జాగృతం చేసేవి పత్రికలు మాత్రమే నేడు వార్తా పత్రికా దినోత్సవం

కొవిడ్‌ ‌కారణం గా పత్రికా రంగం తీవ్రం గా ధెబ్బ తింది. పాఠకులు పత్రికలు ఇంటికి వేయించుకొవడం తగ్గింది. పేజీలు కూడా తగ్గినాయి. ఆన్‌ ‌లైన్‌లో పత్రికలు చదివే వారి సంఖ్య పెరిగింది. పెద్ద పత్రికల ధరలు కూడా సుమారు ఏడు రూపాయలు వుంది.పత్రికలను కొని చదివే అలవాటు తెలుగువారిలో తక్కువగా ఉండడం భాధాకరమైన విషయమే. తమిళనాడులో పత్రికలు కొని చదివే అలవాటు ఎక్కువ అవడం మూలాన పత్రికా రంగం బలంగా స్థిరంగా ఉంది. ఇక్కడ పత్రికలు ఇతర భాషలపత్రికలకన్న తక్కువ ధరకే అందించగలుగుతున్నాయి. పత్రికా నిర్వహణ లోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు. కొత్తదనం తీసుకొస్తున్నారు. పత్రికారంగం మంచి పోటీరంగం అయింది. పెరుగుతున్న సాంకేతిక ప్రక్రియను తగిన రీతిలో వినియోగిం చుకోగలిగిన వారికి పాఠక ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదన్నది నిజం.

ప్రజాస్వామ్య వ్యవస్థ లో పత్రికల పాత్ర ఎనలేనిది.. మూల స్తంభాలు పత్రికలే.. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ ను కధిలిస్టూ వుంది. ఫొర్త్ ఎస్టేట్‌ ‌గా పత్రికా రంగాన్ని పిలుస్తారు. పత్రికలు లేని సమాజాన్ని ఊహించ లేము.జాతీయోద్యమ కాలం,స్వాతంత్య్ర పోరాటం కాలము, గ్రంధాలయ ఉద్యమం కాలం లో వీటి పాత్ర వెలకట్ట లేనిది. దేశంలో నవంబర్‌ 16, 1966‌వ సంవత్సరంలో ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా స్థాపించారు. ప్రతి సంత్సరం ఈ రోజున నేషనల్‌ ‌ప్రెస్‌ ‌డే (జాతీయ పత్రికా దినోత్సవం)గా జరుపుకుంటారు.ఇంటర్నెట్‌లో వార్తలు ఎప్పటి కప్పుడు అందుతున్నాయి. ఇన్ని రకాలుగా వార్తలు అందుకునే అవకాశము ఏర్పడినా వార్తలను అందుకుంటున్నా నేటికీ ప్రజలు వార్తల కోసం చివరిగా నమ్మేది వార్తాపత్రికలను మాత్రమే. ఒక చేతితో వార్తా పత్రిక మరో చేతిలో టీ కప్పు… అది ఒక రకమైన సామాజిక హోదాకు చిహ్నము. ఇది ఒక భాషకు , ఒక ప్రాంతానికి పరిమితమైన విషయము కాదు. ప్రపంచవ్యాప్తంగా వార్తా పత్రికలకు ఏమాత్రము ఆదరణ తగ్గలేదని చెప్పవచ్చు.మన దేశ వార్తాపత్రిక వ్యవస్థకు పునాది 1780 సంవత్సరములో పడింది. ఆనాటికి పాలన బ్రిటిష వారి చేతిలోకి వెళ్ళింది. కలకత్తా నగరము రాజధానిగా పాలన సాగిస్తున్న కాలము. అటువంటి సమయములో తొలి వార్తాపత్రిక గా ‘‘ హికీస్‌ ‌బెంగాల్‌ ‌గెజిట్‌ ’’ అనేది జనవరి 29.1780 న విడుదల అయింది. ఆ సంవత్సరములోనే కలకత్తా లో రైటర్స్ ‌బిల్డింగ్‌ ‌నిర్మాణము కూడా పుర్తయింది. బెంగాల్‌ ‌గెజిట్‌ ‌తొలి సంచిక విడుదల అయిన జనవరి 29 ని వార్తాపత్రిక దినోత్సవం గా జరుపుకుంటున్నారు.

ఆ పత్రికను ప్రచురించినది ‘‘జేమ్స్ అగస్టిన్‌ ‌హిక్‌’’ అం‌దుకే అతని పేరు … అది ప్రచురితమవుతున్న ప్రాంతమైన బెంగాల్‌ ‌ను కలిపి ‘ హికీస్‌ ‌బెంగాల్‌ ‌గెజిట్‌ ’ అన్నారు. ఆ పత్రికలోనే తొలి వ్యాపార ప్రకటన విడుదలైంది తెలుగునాట పాఠకులను విశేషం గా కదిలించిన పత్రికలు ‘ ఆంధ్ర పత్రిక ‘కృష్ణా పత్రిక, గోల్కొండలు వాటి ప్రాచుర్యము క్రమముగా కోల్పొయీ మూతబడ్డాయి. తెలుగు భాషకు సంబంధిం చినంతవరకు నిర్విఘ్నముగా వెలువడుతున్న వార్తాపత్రిక గా ‘జమీన్‌ ‌రైతు’ ని పేర్కొనవచ్చును. ఎనిమిది శతాబ్దాలకు పైగా ప్రచురణ చరిత్ర దీనికున్నది. మిగిలిన దేశాలలో ఎలా ఉన్నా మన దేశంలో వార్తా• •త్రికలు తొలి నుండి ఒక స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తూనే వచ్చాయి. మన దేశములో వార్తాపత్రికలు ప్రారంభమైన తొలిరోజుల్లో ‘గెజిట్‌ ’ ‌తన మోటో గా ఒక చక్కని వాక్యం ప్రచురించింది . ‘‘ మాది ఒక రాజకీయ, వ్యాపార పత్రిక … అన్ని రాజకీయ పార్టీలకు స్థానము కల్పిస్తాం కాని ఏ రాజకీయ పార్టీ ప్రభావానికి లోను కాము ‘‘ అన్న నాటి గెజిట్‌ ‌లక్ష్యమే నేటికీ పత్రికలకు ఆదర్శము గా నిలుస్తుంది.

ప్రాంతీయ భాషలలో కొన్ని పత్రికలు కొన్ని పార్టీల కొమ్ము కాసేవిగా ముద్రపడ్డాయి. అయితే అటువంటి రాజకీయ ముద్ర ఆయా పత్రికల ఎదుగుదలను ఏదో ఒక సమయం లో దెబ్బతీస్తుంది. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంత ప్రచారానికి తమ కంటూ సొంత పత్రికలు ఉండాలని భావించాయి. కొన్ని సంస్థలు పత్రికల ను నిర్వహిస్తున్నాయి.పత్రికలలో పెద్ద పీట రాజకీయ పత్రికలదే. ప్రాంతీయ భాషలలో పత్రికలకు అధిక ఆదరణ ఉండడం గమనించిన జాతీయ స్థాయి పత్రికలు ప్రాంతీయ ఎడిషన్లను ప్రారంభంచాయి. ఇండియా టుడే, సండే ఇండియన్‌ ‌వంటి ఆంగ్ల పత్రికలు దక్షిణాది భాషలలో కూడా తమ ప్రచురణలు మొదలు పెట్టాయి. దేశ రాజధాని అయిన దిల్లి నగరం నుంచి పలు ప్రాంతీయ భాషా వార్తాపత్రికల ప్రచురణ ప్రారంభమైంది . దిల్లిలో మొత్తం 15 భాషలలో వార్తాపత్రి కలు వస్తున్నాయి. భారతదేశ జనాభాలో పత్రికలు చదివే పాఠకులు 20 శాతమే ఉన్నారు. అందులో కేవలం 10 శాతము మంది మాత్రమే పత్రికలను కొని చదువుతారు. మిగిలినవారు పత్రికలను పంచుకొని లేదా లైబ్రరీలలో చదువుతుంటారు.

కొవిడ్‌ ‌కారణం గా పత్రికా రంగం తీవ్రం గా ధెబ్బ తింది. పాఠకులు పత్రికలు ఇంటికి వేయించుకొవడం తగ్గింది. పేజీలు కూడా తగ్గినాయి. ఆన్‌ ‌లైన్‌లో పత్రికలు చదివే వారి సంఖ్య పెరిగింది. పెద్ద పత్రికల ధరలు కూడా సుమారు ఏడు రూపాయలు వుంది.పత్రికలను కొని చదివే అలవాటు తెలుగువారిలో తక్కువగా ఉండడం భాధాకరమైన విషయమే. తమిళనాడు లో పత్రికలు కొని చదివే అలవాటు ఎక్కువ అవడం మూలాన పత్రికా రంగం బలంగా స్థిరంగా ఉంది. ఇక్కడ పత్రికలు ఇతర భాషలపత్రికలకన్న తక్కువ ధరకే అందించగలుగుతున్నాయి .పత్రికా నిర్వహణ లోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు. కొత్తదనం తీసుకొస్తున్నారు. పత్రికారంగం మంచి పోటీరంగం అయింది. పెరుగుతున్న సాంకేతిక ప్రక్రియను తగిన రీతిలో వినియోగిం చుకోగలిగిన వారికి పాఠక ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదన్నది నిజం.విశ్లేషకుల అంచనా ప్రకారం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తం గా పత్రికా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది . ఆర్ధిక సంక్షోభం తోడుగా టెలివిజన్‌, ఇం‌టర్నెట్‌ ‌దెబ్బకు ఆంగ్ల భాషాపత్రికలు బాగా దెబ్బతింటున్నవి.ఐరోపా, అమెరికా ఖండాలలో పత్రికలు పాఠకుల ఆదరణ పొందలేకపోయాయి.

ఇటీవల సర్వే ప్రకారం ఐరోపా ఖండం లో పత్రికా పాఠకుల సంఖ్య కేవలం 4.80 కోట్లే. అదే అమెరికాలో ఆ సంఖ్య 9.70 కోట్లు. ఆ రెండు ఖండాలలోని పత్రిక పాఠకుల కలిపిన సంఖ్య కంటే ఎక్కువ మంది భారతదేశంలో ఉన్నారు. మన దేశ పత్రిక పాఠకుల సంఖ్య 25 కోట్లు పైనే ఉంటారు అని అంచనా. ప్రపంచం మిగతా ప్రాంతాలలో పాఠకుల సంఖ్య తగ్గుతుంటే భారత్‌ ‌లో ఏటా 10 శాతము వంతున పెరుగుతుంది. ఇది పత్రికారంగానికి , పాఠకులకు ఆనందం కలిగించే విషయం. వార్తా ప్రసారరంగం లో పత్రికలదే పైచేయి అనే విషయం వాణిజ్య ప్రకటన రంగం కూడా నిర్ధారిస్తుంది. మిగిలిన ఎన్ని రకాలుగా వ్యాపార ప్రకటనలు విడుదల చేసినా వినియోగదారుడి మీద ప్రభావం చూపేది మాత్రం పత్రికా ప్రకటనలే అని వారు భావిస్తున్నరు. పత్రికల్లో ప్రకటనలు ఒకటికన్నా ఎక్కువసార్లు పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే అడ్వర్టైజింగ్‌ ‌బడ్జెట్‌ ‌లో పత్రికా ప్రకటనకే ఎక్కువ కేటాయిస్తున్నారు. ప్రజా సమస్యలు వెలికి తీసెలా పత్రికలు కృషి చేయాలి.అన్ని పత్రికలను,పాత్రికేయులను గౌరవంగా చూద్దాం .పత్రికా దినోత్సవం ని జరుపుకుందాం.

– కామిడి సతీష్‌ ‌రెడ్డీ, జడలపేట జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా..
9848445134

Leave a Reply