రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1897 మందికి పాజిటివ్గా నమోదయింది. వైరస్ నుంచి 2982 మంది కోలుకోగా, మహామ్మారి కారణంగా 15 మంది మృతి చెందారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదవగా ఖమ్మం జిల్లాలో 163 కేసులు, నల్గొండ జిల్లాలో 151 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 5,95,000 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,409కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,67,285 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 24,306గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.