రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 894 కొరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 147 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. ఇవాళ 2,006 మంది వైరస్ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 21,420 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో 14,404 మంది ఉన్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో 8794 మందికి కొవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,53,349 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో 147, రంగారెడ్డి జిల్లాలో 85, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 9, ఖమ్మంలో 44, వరంగల్ అర్బన్జిల్లాలో 44, వరంగల్ గ్రాణ జిల్లాలో 9 చొప్పున, ఆదిలాబాద్ జిల్లాలో 10, జగిత్యాల జిల్లాలో 31, జనగామా జిల్లాలో 7, జోగుళాంబా గద్వాల జిల్లాలో 21, నల్గొండ జిల్లాల్లో 37, కామారెడ్డి జిల్లాల్లో 7, సిద్దిపేట జిల్లాల్లో 58, సిరిసిల్ల జిల్లాల్లో 2, గద్వాల జిల్లాల్లో 21, పెద్దపల్లి జిల్లాల్లో 62 , సూర్యాపేట జిల్లాల్లో 12, నిజమాబాద్ 38, మహబూబాబాద్ జిల్లాల్లో 31 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.