Take a fresh look at your lifestyle.

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌ఛార్జిషీటులో నా పేరు లేదు

  • నేటి విచారణకు హాజరు కావడం లేదు
  • ముందస్తు కార్యక్రమాల షెడ్యూల్‌తో బిజీగా ఉన్నా
  • 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటా
  • సిబిఐ అధికారికి మరో లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌5:‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో నోటీసులు అందుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నేడు  విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో నేటివిచారణకు రాలేనని అందులో స్పష్టం చేశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. తాను ఎఫ్‌ఐఆర్‌ ‌కాపీని అడిగితే వెబ్‌సైట్‌ ‌లో చూసుకోవచ్చని సీబీఐ అధికారులు చెప్పారని కవిత పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ ‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన నిందితుల జాబితాను తాను క్షుణ్నంగా పరిశీలించానని, దానిలో తన పేరు లేదన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత చెప్పారు. పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు విచారణకు హాజరవుతానని లేఖలో తెలిపారు. నిజానికి సీబీఐ నోటీసులు జారీ చేయగానే.. డిసెంబరు 6న విచారణకు అందుబాటులో ఉంటానని కవిత చెప్పారు.

అయితే ఒకరోజు తర్వాత కేసులో క్లారిఫికేషన్‌ ‌కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ‌కాపీని తనకు అందించాలని కోరారు. కవిత అభ్యర్థనపై స్పందించిన సీబీఐ అధికారులు ఈ -మెయిల్‌ ‌ద్వారా సమాధానం ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ ‌కాపీ వెబ్‌ ‌సైట్‌ ‌లో అందుబాటులో ఉందని అన్నారు. ఈ సమాచారం ప్రకారం సీబీఐ వెబ్‌ ‌సైట్‌ ‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్‌ ‌ను చెక్‌ ‌చేసుకున్న కవిత.. అందులో తన పేరు లేదంటూ తాజాగా సోమవారం లేఖను విడుదల చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ ‌సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ’సీబీఐ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎఫ్‌ఐఆర్‌ను క్షుణ్నంగా పరిశీలించాను. అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను చూశాను. దాంట్లో నా పేరు ఎక్కడా లేదు’ అని తెలిపారు.

ఈ కేసులో వివరణ కోసమే సీబీఐ ఇచ్చిన నోటీసులపై కవిత ప్రతిస్పందిస్తూ.. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ‌కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసిన విషయం విదితమే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్‌ ‌ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్‌ఐఆర్‌ ‌కాపీ వెబ్‌సైట్‌లో ఉందని తెలిపారు. దాం తో తాను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారికి లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాలతో ఈ నెల 6వ తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో కు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత చెప్పారు. దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో చెప్పారు.

Leave a Reply