Take a fresh look at your lifestyle.

ఇకో-టూరిజమ్‌ ‌గమ్యంగా ముప్ఫయ్‌ ‌బంజరు భూక్షేత్రాలు

తీర్చిదిద్దడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : మొత్తం 1610 హెక్టార్‌లలో విస్తరించిన 30 బంజరు భూక్షేత్రాలను సుందరమైన ఇకో-టూరిజమ్‌ ‌గమ్యంగా మలచిన కోల్‌ ఇం‌డియా జట్టు ప్రయాసలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ పర్యాటక కేంద్రాన్ని చూడడానికి కేవలం ప్రజలే కాక పక్షుల సమూహాలు కూడా వొస్తున్నాయి. రైలు మార్గాలు, బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ ‌పాటిల్‌ ‌దానవే చేసిన అనేక ట్వీట్‌లకు ప్రధాన మంత్రి సామాధానం ఇస్తూ…‘‘నిలకడతనంతో కూడినటువంటి వృద్ధిని మరియు ఇకో-టూరిజమ్‌ను వృద్ధి చెందింప చేయడం కోసం ఇది ఒక ప్రశంసనీయమైనటువంటి ప్రయాసగా ఉంది’.’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు

Leave a Reply