గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్, మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగళవారం ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు బుధవారం పరిశీలించనున్నరు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది.
మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరగనుంది. మార్చి 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. కాగా నిన్న అఫిడవిట్ సరిగ్గా లేనందున టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి మంగళరం నామినేషన్ వేశారు.