“ఒక విధంగా రాష్ట్ర రాజధానిలో ఇటీవల జరిగిన గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధవాతావరణాన్ని తలపించాయి. అదే క్రమంలో ఇప్పుడు మరో మినీ యుద్ధ వాతావరణానికి రాష్ట్రం సిద్దం కాబోతున్నది. రెండు ఎమ్మెల్సీలతో పాటు, ఒక శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానంతో పాటు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక మార్చ్లో జరుగనుండగా ఇప్పటి నుండే రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.”
