విజయవాడ,మే 29 : చంద్రబాబుది మహానాడు కాదు.. మాయనాడు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలఅన అంతా అవినీతిమయ మన్నారు. విద్య,వైద్య రంగాలను పూర్తిగా దెబ్బతీసారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన డియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు.గత ప్రభుత్వ ంలో ఎన్నికల మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి టీడీపీ తొలగించిందని గుర్తు చేశారు.
ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏడాది కాలం లోనే 90శాతం హాలను నెరవేర్చారని తెలిపారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన మేని ఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా భావిస్తుం దన్నారు.పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వర మని..పేదలందరికీ వైద్యం అందించాలన్నదే సీఎం జగన్ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. ఆంధప్రదేశ్తో పాటు కర్ణాటక, ఇతర రాష్టాల్లో్ర కూడా హెల్త్కార్డులు వినియోగిం చుకునేలా వైఎస్ జగన్ సంకల్పించారని తెలిపారు.గత ఐదేళ్ల టీడీపీ పాలనలో పేదల ఆరోగ్యంపై చంద్రబాబు అనేక స్కామ్లకు పాల్పడ్డారని మంత్రి విమర్శలు గుప్పించారు.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని సీఎం జగన్ పూర్తి ప్రక్షా ళన చేశారని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.