- గ్రామీణ దీన్ దయాల్ స్వశక్తి కరణ్ పురస్కార్కు ఎంపికైన గుర్రాలగొంది
- అవార్డు ప్రదానం చేసిన మంత్రి తన్నీరు హరీష్రావు
గ్రామాల ఐక్యతకు నిదర్శనం. సిద్ధిపేట నియోజకవర్గానికి జాతీయ స్థాయి అవార్డులని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో గుర్రాలగొంది గ్రామ పంచాయతీ పాలక వర్గానికి మంత్రి హరీష్ అవార్డు ప్రధానం చేశారు. గత జూన్ నెల 16న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో సిద్ధిపేట జిల్లాలోని గుర్రాలగొంది గ్రామానికి గ్రామీణ దీన్ దయాల్ స్వశక్తి కరణ్ పురస్కార్కు ఎంపికైన విషయం తెలిసిందే.
ఈ అవార్డును ప్రతి యేటా ఢిల్లీలో ప్రధానం చేస్తారు. ఈ సంవత్సరం కొరోనా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాలకు అవార్డులు పంపింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ హరీష్, ఉప సర్పంచ్ సంజీవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, గ్రామ ప్రజలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీయస్ వైస్ చైర్మన్ సత్తయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ కె.కనకరాజు, ఎంపీటీసీలు మల్లేశం, సత్తయ్య, మాజీ సర్పంచ్ కనకయ్య, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.