Take a fresh look at your lifestyle.

‌మైసంపల్లి ఇండ్లను నా భార్య, పిల్లలకు చూపిస్తా-మీతో సహపంక్తి భోజనం చేస్తా’!

పేదల చెమట చుక్కపడకుండానే గృహ ప్రవేశాలు
మైసంపల్లి ఎస్సీ గృహాల ప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు

నిరు పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి కలుగుతుందని, ఈ వారం రోజులలో రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. శనివారం సాయంత్రం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని కొండంరాజ్‌ ‌పల్లి, ఖాతా, మైసంపల్లి  గామాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో హాజరై మంత్రి మాట్లాడుతూ.. మైసంపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో రెండు పడకలను మా ఆవిడ, పిల్లలను తీసుకొచ్చి మీ ఎస్సీ కాలనీలో నిర్మించిన కొత్త ఇండ్లు చూపిస్తానని, మీతో కలిసి సహపంక్తి భోజనం చేస్తానని చెప్పారు. మైసంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 25 రెండు పడకల గృహా ప్రవేశాల కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులతో కలిసి గృహా ప్రవేశాలు జరిపారు. కొత్త ఇండ్లకు వెళ్లిన ప్రతి లబ్ధిదారు కుటుంబాలకు కొత్త బట్టలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. xprague.com
 మీ కొత్త ఇండ్లు చూస్తా ఉంటే.. నాకు కడుపు నిండినంత ఆనందంగా ఉన్నదని, జీవితంలో తృప్తినిచ్చిన పని ఏదైనా ఉందంటే ఇదేనని, గృహా ప్రవేశాలు జరిగిన ఇళ్లను, లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూస్తే.., వారిచ్చిన దీవెనలతో ఇంతకంటే ఇంకేమీ కావాలని అనిపించిందని వారితో కలిసిన సంబురాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రిగా తానూ నిత్యం బిజీ బిజీగా.. రాత్రింబవళ్ళు తిరుగుతూ.. ఇంటికి సమయం కేటాయించడం లేదని ఇంట్లో మా ఆవిడ, పిల్లలు అంటున్నారని, సిద్ధిపేట, మైసంపల్లి గ్రామాలలో కట్టిన కొత్త రెండు పడకల ఇళ్లు కట్టి, నిజమైన నిరు పేదలైన మిమ్మల్ని ఇంటికి తోలినట్లు వారికి చూపుతానని మంత్రి చెప్పుకొచ్చారు.

 

Leave a Reply