Take a fresh look at your lifestyle.

పేదలకు ఇళ్లస్థలాలు రాకుండా బాబు కుట్ర

  • కోర్టుల్లో కేసులతో అడ్డుకుంటున్న తీరు సరికాదు
  • డియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ,జూలై 7 : పేదలకు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి మంచి చేస్తుంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మున్సిపల్‌, ‌పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన డియా సమావేశంలో మాట్లాడుతూ మొదట 25 లక్షలు అనుకున్నాం, 30 లక్షలు పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌సిద్ధమయ్యారు. భూములు స్వచ్చందంగా ఇచ్చారు. భూ సేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుంది. కోర్టులు నుంచి స్టే తీసుకు వచ్చి టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలను గమనిస్తున్నారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదని మండిపడ్డారు. నాడు దివంగత మహానేత వైఎస్సార్‌ ‌ప్రతి పేదవారికి ఇళ్లను అందిస్తే.. అదే స్ఫూర్తితో నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.

ఈ రోజు పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఆలస్యం కావచ్చేమో గానీ ఇవ్వడం మాత్రం పక్కా అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు బొత్స తెలిపారు. నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ఆదేశించారని పేర్కొన్నారు. సింగ్‌నగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో మోడల్‌ ‌పార్క్ అభివృద్ధికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఏడాది లోపు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీవీఆర్‌ ‌స్కూల్‌ ‌కాంపౌండ్‌లో రూ. కోటిన్నరతో భవన నిర్మాణం, రూ. 90లక్షలతో లెనిన్‌ ‌పార్కు అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. టిడ్కో ఇళ్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి బొత్సతోపాటు మరో మంత్రి అనిల్‌ ‌కుమార్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు.

Leave a Reply