ఫలితాల ప్రకటనపై సీఎం జగన్కు ప్రతిపాదనలు మంత్రి ఆదిమూలపు సురేశ్
అమరావతి, జూలై 21 : ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్కు ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి సురేష్ తెలిపారు. కరోనా కారణంగా ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇప్పటికే రద్దయ్యాయి. ఫలితాల ప్రకటనపై విద్యార్థులంతా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. దాంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తాజాగా టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఏపీ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
ఫలితాలపై నివేదిక రెడీ చేసింది. గ్రేడ్ల విధానంతో మార్కులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్, టెన్త్ ఇంటర్ పరీక్షలు విడుదల చేయనుంది. టెన్త్, ఇంటర్ ఫలితాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం డియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే టెన్త్, ఇంటర్ పరీక్షలను విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్కు ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని ఆదిమూలపు సురేశ్ తెలిపారు.