- తెలంగాణ పోలీసులకు ఎంపి అసదుద్దీన్ ప్రశ్న
- 127మందికి ఆధార్ తాఖీదులపై మండిపాటు
కార్డెన్ సెర్చ్లో పోలీసులు ఆధార్ అడగడం మానేయాలని, ఆధార్ అడిగే హక్కు పోలీసులకు లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ స్పష్టం చేశారు.కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో ఆధార్ చూపమని అడగటం విరమించుకోవాలని, ఇలా చేయడానికి కు చట్టబద్ధ అనుమతి లేదని తెలంగాణ పోలీసులను ఉద్దేశించి ఏఐఎంఐఎం చీఫ్ ట్వీట్ చేశారు.
నగరంలో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు ఇవ్వడంపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. 127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎవరని ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు, ఆధార్ సంస్థకు అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. 127 మంది జాబితాపై తెలంగాణ డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసులో పౌరసత్వ వెరిఫికేషన్ అనే పదాన్ని ఉపయోగించారని, ఆధార్ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ను ఉడాయ్ సస్పెండ్ చేయాలని మరో పోస్టులో ఆయన కోరారు.