Take a fresh look at your lifestyle.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నా- టిపిసిసి చీఫ్ ఉత్తమ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణలో గ్యాలరీ కూలి గాయాలపాలైన క్షతగాత్రులు, కుటుంబాలు త్వరగా కోలుకోవాలని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఇంతమంది గాయపడడం అత్యంత శోచనీయం , బాధాకరమన్నారు. నిర్వాహకులు ఎవరు, గ్యాలరీని ఎవరు సర్టిఫై చేశారు..అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చారు..

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉండాలన్నారు. గాయపడినవారికి తక్షణమే అన్నివిధాల వైద్యసదుపాయాలు అందించాలని కోరారు.కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా గాయపడ్డవారిని, వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.

Leave a Reply