
సమావేశంలో ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్మికచట్టాలను సవరించి లేబర్ కోడ్లు తెచ్చాక వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి భద్రత మరింతగా దిగజారిందని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రక్షించుకోవాలని , పూర్వం సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని అన్నారు.