- అన్నింటా ఆదర్శమైన గజ్వేల్
- నియంత్రిత పంట సాగులో ఆదర్శంగా తీర్చిదిద్దండి
- గజ్వేల్లో మంత్రి హరీష్రావు
రాష్ట్రానికే అన్నింటా గజ్వేల్ ఆదర్శం. నియోజకవర్గ పరిధిలో ప్రతి గుంట, ప్రతి గంట వారంలో ఎవుసం ప్రణాళికా లెక్కలు తీయండి. నియంత్రిత పంట సాగులో కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులదేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని మహాతి ఆడిటోరియంలో శనివారం వానా కాలం-2020 నియంత్రిత పంటల సాగుపై రైతుబంధు సమితి మండల సమన్వయ కర్తలకు, వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచ్ లు, ఏంపీటీసీలు, ఏంపీపీ, జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…
రాష్ట్రానికి అన్నింటా గజ్వేల్ ఆదర్శం. నియంత్రిత పంట సాగులో కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులదేనని మంత్రి దిశానిర్దేశం చేశారు.నియంత్రిత సాగు కూడా సాధ్యం చేసి చూపుదాం. ఈ వారంలోపే గ్రామ, వ్యవసాయ ప్రణాళికలు తయారు చేయాలి. ప్రతి గుంట, ప్రతి గంట ఈ వారంలోపే గ్రామం వారీగా వ్యవసాయ లెక్కలు తీయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల్లో ఆత్మ విశ్వాసం వచ్చింది. రైతు ఒక శక్తిగా
ఎదిగేలా.. రైతులను సంఘటితం చేసి ఒకే తాటిపైకి తెచ్చి రైతే తాను పండించిన పంటకు ధర నిర్ణయించడమే..ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నియంత్రిత పంట సాగు. రైతు మరోకరిపై ఆధారపడొద్దన్నదే ప్రభుత్వ తాపాత్రయం. గజ్వేల్ లో లక్షా 70 వేల ఎకరాల సాగు భూమి ఉందని, పోయిన వానా కాలంలో 27 వేల ఏకరాల్లో వరి పంట సాగు చేశారని., కొండ పోచమ్మ సాగరుకు గోదావరి జలాలు వచ్చాక భూగర్భ జలాలు పెరిగి.. మనకేమీ బాధలు ఉండవు. ఈ వానా కాలం నుంచి 27 వేల నుంచి 50 వేల ఎకరాల దాకా వరి సాగు పెంపు చేద్దామని, కొంత సన్న రకం, కొంత దొడ్డు రకం వరి పంటలు వేద్దామని ప్రజాప్రతినిధులకు, వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు.వానా కాలం మక్క పంట వేసే బదులు యాసంగికి పోదామని ప్రభుత్వం సూచన చేస్తున్నది. స్వీట్ కార్న్, సీడ్స్ కు అమ్మేటోళ్లు, దాణాకు అమ్మేటోళ్లకు, కంకులు అమ్మే రైతులకు మక్కజొన్న పంట వేసే వీలుంది. కానీ ముందే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని, వీరికి రైతుబంధు వస్తుందన్నారు. వానా కాలం కందులు ఎక్కువ వేయమని., ప్రభుత్వం చెబుతున్నదని., వానా కాలంలో మక్క పంట వేస్తే., రైతులు నష్టపోతున్నారని., మక్క పంట ఎందుకు వద్దంటున్నామంటే.. కత్తెర పురుగు వచ్చి., పంట దిగుబడి దాదాపు 15 క్వింటాళ్లలో మక్క దిగుబడి తగ్గుతుందని, వానా కాలంలో మక్క పెడితే.. పౌల్ట్రీ ఫామ్ కోసం వద్దని.. ప్రభుత్వం సూచిస్తుందని, అందరికీ అవగాహన కలిగేలా సవివరంగా మంత్రి వివరించారు.
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల వారీగా కందుల పంటలు వేసిన వివరాలు తెలుపుతూ.., పత్తి లాభసాటిగా ఉందని, గత వానా కాలంలో 83 వేల ఎకరాల్లో సాగు చేశారని, ఈ యేటా 90 వేల ఎకరాల్లో పత్తి సాగు పెంపు చేయాలని సూచించారు. సిద్ధిపేట జిల్లాలో 9 వేల ఏకరాల్లో కూరగాయలు పండితే.. 5 వేల ఎకరాలు గజ్వేల్ నియోజక వర్గానిదేనని., కూరగాయల సాగు చేసే రైతులకు అధిక ప్రోత్సాహం ఉంటుందని మంత్రి వెల్లడించారు.సన్న, దొడ్డు రకం వరి పంట రకాల గురించి క్షుణ్ణంగా.. అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల మేలు కోసమే పని చేస్తుంది. మార్కెట్లో ఉన్న డిమాండ్, అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్ ఆధారంగా సాగు చేయాలి.రైతు బంధు ఇవ్వమనేది.. ప్రభుత్వ ఉద్దేశం కాదు.. ప్రతి రైతుకు రైతుబంధు అందిస్తాం. వానా కాలం పంట కోసం రైతులకు రైతు బంధు కోసం రూ.7 వేల కోట్ల బడ్జెట్ లో పెట్టామన్నా••.రు. రైతు సంక్షేమానికై, రైతు గౌరవం పెంచడం, రైతు తన పంటకు తానే ధర నిర్ణయించుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రయత్నం.ఈ మేరకు వానా కాలం 2020 నియంత్రిత పంటల సాగుపై పలు మండల, గ్రామ ప్రజాప్రతినిధులతో మంత్రిమమేకమై మాట్లాడుతూ.. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…ఉమ్మడి జిల్లాలో నియంత్రిత పంట సాగుకు కృషి చేస్తున్న మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఏ కష్టమొచ్చినా అతివృష్టి, అనావృష్టి ఏదొచ్చినా నష్టపోయేది.. రైతులేనని, ఆ రైతులు చేసే సాగు లాభసాటిగా ఉండేలా.. సీఏం కేసీఆర్ నియంత్రిత పంట సాగు విధానం ప్రవేశ పెట్టారని సూచించారు. మంచి లాభసాటి పంటలు పండించి రైతులు ధనవంతులు కావాలన్నదే సీఏం కేసీఆర్ ధ్యేయమని తెలిపారు. సిద్ధిపేట జిల్లా ప్రాంతం జలాశయాలు నిండి సాగులో దేశంలోనే నంబర్ వన్ కాబోతున్నదని ఏంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.