- 2018-19ఆర్థిక సంవత్సరంలో 8.2శాతం
- 2019-20 లో 9.69లక్షల
- కోట్లకు చేరిన తెలంగాణ సంపద
- సామాజిక ఆర్థికసర్వే నివేదిక
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు ఆశాజనకంగా ఉన్నదని, ప్రపంచవృద్ధిరేటు కన్నా తెలంగాణ వృద్ధిరేటు అధికంగా ఉన్నదని సామాజిక ఆర్థిక సర్వే తెలియ చేసింది. భారతదేశ వృద్ధిరేటుపైన ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రపంచబ్యాంక్ పెదవి విరిచిన సంగతి తెలిసిందే. భారతదేశ వృద్ధిమీద టెలిగ్రాఫ్, హిందూస్తాన్ టైమ్స్, మిర్రర్ వంటి పత్రికలు విమర్శలు చేసిన విషయాలను కూడా సామాజిక ఆర్థిక సర్వే ఉదహరించింది. 2018-19లో ప్రపంచవృద్ధిరేటు 2.4శాతం ఉండగా, భారతేశ వృద్ధిరేటు 5శాతం ఉన్నది,.. ఇదే సమయంలో తెలంగాణ వృద్ధిరేటు 8.2శాతంగా నమోదైంది. ఈ వృద్ధిరేటును రిజర్వ్బ్యాంక్, ఇతర జాతీయ సంస్థలు నిర్ధారించాయని సామాజిక ఆర్థికసర్వేలో పేర్కొన్నారు.జాతీయ వృద్దిరేటు 9శాతానికి చేకుంటామని గతేడాది జూలైలో కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు, రిజర్వ్బ్యాంక్ వంటి జాతీయ సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం 5శాతం వృద్ధిరేటు కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ తెలంగాణ వృద్ధిరేటు నిలకడగా ఉండటం గమనార్హం.2014-15లో తెలంగాణలో 5.05లక్షల కోట్ల సంపద సృష్టిఅయ్యిందని సర్వే పేర్కొన్నది. అదే సందర్భంలో 2019-20లో తెలంగాణ ప్రజలు 9.69 లక్షల కోట్ల సంపద సృష్టించారు. విద్యుత్తు రంగంలో సాధించిన గొప్ప విజయాలు,రైతుబంధుద్వారా ఇస్తున్న పెట్టుబడి, సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి ప్రజల కొనుగె•లుశక్తి పెరగడం వంటి అనేక కారణాలతో తెలంగాణ రాష్ట్ర వృద్ధిరేటు పెరిగిందని ఆర్థిక సర్వే గణాంకాలతో ఉదహరించింది. 2014-15లో 12లక్షల ఎకరాలు మాత్రమే సాగుకాగా, 2019లో 38లక్షల ఎకరాలు సాగయ్యిందని వ్యవసాయ గణాంకాలు తెలియచేస్తున్నాయి.
అంతర్జాతీయంగా సంపదసృష్టిలో పోటిపడుతున్న అమెజాన్, గూగుల్, వాల్మార్ట్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధిచెందిన అమెరికా వంటి దేశాలతో సమానమైన క్యాంపస్లతో అతిపెద్ద వ్యాపార సంస్థలను నెలకొల్పడం, అంతర్జాతీయ మార్కెట్ను తెలంగాణ పటంలోకి ఆకర్షించడంతో మందగమనం తాకడి తెలంగాణను పలుకరించడంలేదని అంతర్జాతీయ ఆర్థిక సర్వేలు పేర్కొన్నట్లు సోసియో ఎకానమిక్ సర్వే ఆఫ్ తెలంగాణ స్పష్టం చేసింది. ప్రధానంగా జాతీయ తలసరి విద్యుత్తు వినియోగం కన్నా తెలంగాణ విద్యుత్తు వినియోగం ఎక్కువంగా ఉండటాన్ని దేశంలోని ఆర్థిక సంస్థలన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 7774 స్థాపిత విద్యుత్తు సామర్థ్యం మాత్రమే ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్తు స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 16వేల మెగావాట్లకు చేరుకున్నదని ఆర్థిక సర్వే తెలియచేసింది.ఇందుకు కందిపంటను ఉదాహరణగా వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. గత అర్థశతాబ్బకా లంలో కంది ఇంతపెద్దమొత్తంలో ఎప్పుడు పండలేదని వ్యాఖ్యానిస్తున్నారు. 2లక్షల 5 క్వింటాళ్ల కందిపంట పడిందని సర్వేలు తెలియచేస్తున్నాయి.
మరోవైపున మహారాష్ట్ర,కర్నాటక, కేరళ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే రియల్ఎస్టేట్ రంగంలో తెలంగాణ వృద్ధి చాలా ఆశాజనకంగా ఉన్నదనేది నిపుణుల అంచనా. పారిశ్రామికంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కారిడార్లకు రోడ్మ్యాప్ నిర్ణయించడం 10 జిల్లాలను 33 జిల్లాల తెలంగాణగా మార్చడంతో పాటు మున్సిపాలిటీలకు సమీపంలోని గ్రామపంచాయతీలను కలిసి 67 మున్సిపాలి టీలను 127 మున్సిపాలిటీలుగా, అదేవిధంగా కార్పొరేషన్లను 13కు పెంచడం వంటి కారణాలతో సంపద పెరిటఞగేందుకు, జీఎస్డీపీ వృద్ధి చెందేందుకు మార్గాలు ఏర్పడ్డాయని సామాజిక ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఐటి ఎగుమతులు లక్షలకోట్లు దాటడం, బెంగుళూర్వంటి మహానగరంతో పోటిపడటంతో తెలంగాణ వృద్ధిరేటుకు బలాన్ని ఇస్తున్నాయని నిపుణులు అంచనా. పారిశ్రామి• •రంగం, ఐ.టీ కలిపి తెలంగాణలో ఆరే•్ల కాలంలో 13. 6 లక్షల మందికి ఉపాధి అవకా శాలు లభించాయని ఆర్థిక సర్వే పేర్కొన్నది.
Tags: Maharashtra, Karnataka, Kerala, Chhattisgarh, Madhya Pradesh