- పట్నం నుంచి గ్రామాలకు వేలాది వాహనాలు
- ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు
- విజయవాడ హైవేపై భారీ రద్దీ
- టోల్గేట్ వద్ద తప్పని నిరీక్షణ
ప్రజాతంత్ర, హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భాగ్యనగరం నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్లడంతో ఎక్కడికక్కడ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. దీనికితోడు గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధప్రదేశ్లోని పలు ప్రాంతాలకు వేల సంఖ్యలో వెళ్తున్న వాహనాలతో రద్దీ వాతావరణం కనిపిస్తుంది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై నల్గొండజిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ దగ్గర వరుసగా మూడ్రోజులుగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోవి•టర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగడంతో రద్దీ చాలా పెరిగిపోతుందని వాహనదారులు చెబుతున్నారు. ఒకవైపు సొంత వాహనాలున్న వారు, మరోవైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. శనివారం మకర సంక్రాంతిని కుటుంబసభ్యులతో జరుపుకోవాలని వారు ఇళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు నగరం ఖాళీ అవుతుంటే..పండక్కి గ్రామాలకు వెళ్లేవారితో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై అర్ధరాత్రి వరకు వాహనాల జాతర నెలకొంది. సంకాంత్రి సెలవులు రావడంతో.. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు ప్రయాణికులందరూ ఒకేసారి తరలివెళ్తున్నారు.
రాజధాని నుంచి వొచ్చే వాహనాలు యాదాద్రి భువనగిరిజిల్లా పంతంగి టోల్ప్లాజావద్ద బారులు తీరుతున్నాయి. ఖమ్మం, భద్రాది, నల్గొండ, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం వైపు వేళ్లే వాహనాలన్నీ ఈ టోల్ ప్లాజా వి•దుగానే వెళ్లాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో విజయవాడ వైపు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. వీటిలో కార్లు అధికంగా ఉన్నాయి. వాహనచోదకులు టోల్ చెల్లించడానికి సుమారు అరగంటసేపు వేచిచూడాల్సి వచ్చింది. పోలీసులు జోక్యం చేసుకొని టోల్ చెల్లింపు కేంద్రాలను ఎక్కువగా తెరిపించడంతో పరిస్థితి అదుపులోకి వొచ్చింది. పండక్కి రెండు రోజుల ముందే సొంతూళ్లకు పయనమవడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. మరీ ముఖ్యంగా.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి వొచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఉదయం నుంచే తీవ్రంగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. పెద్దసంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో ప్రజలు రోడ్డు దాటేందుకు సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేటు వద్ద వాహనాలు బారులుతీరాయి. 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా విజయవాడ వైపు వాహనాలను పంపించారు. టీఎస్ ఆర్టీసీ సంక్రాంతికి అదనపు వడ్డన లేకుండా సాధారణ చార్జీలతో ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో ఎక్కువ మంది ఆ బస్సుల్లోనే వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేకబస్సుల్లో 50శాతం అధిక చార్జీ వసూలు చేస్తుండడంతో ఏపీవాసులు సైతం హైదరాబాద్ నుంచి సొంతూరికి వెళ్లడానికి టీఎస్ ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. గడిచిననాలుగు రోజుల్లో టీఎస్ ఆర్టీసీ ఏపీ, తెలంగాణల్లోని పలు జిల్లాలకు 2,700కు పైగా ప్రత్యేక సర్వీసులను నడిపింది. రద్దీ పెరిగితే మరిన్ని అదనపు బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీ తీరును, ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సూచనలు, సలహాలు స్వీకరించారు.
టోల్గేట్ వద్ద తప్పని నిరీక్షణ
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు గ్రామాల బాట పట్టారు. సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకునేందుకు సొంతవాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కారణంగా పతంగి టోల్గేట్ వద్ద రద్దీ నెలకొంది. సొంతవాహనాల్లో వచ్చే వారితో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. నేషనల్ హైవేపై పంతంగి గ్రామం వద్ద టోల్ ప్లాజాను ఏర్పాటుచేశారు. దీంతో కిలోవి•టర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. గంటలతరబడి ఇక్కడే నిలవాల్సిరావడంతో అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరిగా వ్యవహరించడం లేదన్నారు.