తెలంగాణ భద్రాద్రి రెవెన్యూ డివిజన్ ప్రజా పరిరక్షణ హక్కుల సమితి నాయకులు స్థానిక తాతగుడి సెంటర్ సమావేశంలో పిలకా రాము , రాగం నిర్మల రావు మాట్లాడుతూ శ్రీ రాముడు నడి యాడిన ఈ ప్రాంతం భ్దరాద్రి కొత్త గూడెం జిల్లాను భద్రాద్రి రాముడే కరోనా నుండి కాపాడారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా. యంవి రెడ్డి కరోనా కేసులు కట్టడి చేయటంలో చెక్పోసుట్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేసులు రాకుండా కృషి చేసారని కలెక్టర్కు వందనాలు తెలియచేసారు. భద్రాచలం రాష్ట్ర విభజన వలన జిల్లాల విభజన వలన తీవ్రంగా నష్టం జరిగిందని అన్నారు.
ఆంధ్రా, తెలంగాణ టోల్ ట్యాక్ అధికంగా పెరగటం వలన పాపికొండలు బోర్డుప్రమాదం జరగటం వలన భద్రాద్రికి యాత్రికులు తగ్గు ముఖం పట్టారని అన్నారు. దీనితో వ్యాపారం లేక వ్యాపారస్తులు అల్లాడుతున్నారని అన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు కరోనా లాక్డౌన్ వలన రామాలయం మూసివేయటం జనసంచారం లేక చిరువ్యాపారులు ఆర్ధికంగా ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. భద్రాద్రి రామాలయాన్ని తెరిపిం చాలని ఆలయం తెరిస్తే చిరు వ్యాపా రులు ఆర్ధికంగా వెపులుబాటు కలుగుతుందని అన్నారు. ఈ సమా వేశంలో మారేడు శివాజీ, రౌతు కృష్ణ, వెంకటేశ్వరరావు, శ్రీనివా• •రెడ్డి, రవి, నగేష్, పాల్గొన్నారు.