- ధాన్యం సేకరణలో ముందున్న రాష్ట్రం
- రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం
- రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ది పనులకు మంత్రి కెటిఆర్ శ్రీకారం
- తెలంగాణకు ఏంచేశారో బిజెపి చెప్పాలని డిమాండ్
ప్రజాతంత్ర, హైదరాబాద్, జనవరి 29 : దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. రాష్ట్ర ధాన్యాగారంగా మారిందన్నారు. కెసిఆర్ తీసుకున్న రైతు సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయం పండగచేసి చూపామని అన్నారు. బడంగ్పేట్, వి•ర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో శనివారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఎకానవి•లో తెలంగాణ 5వ స్థానంలో ఉందని, తెలంగాణకు సహకరించకుండా కేంద్ర మోకాలడ్డుతుందని దుయ్యబట్టారు. గత ఏడేన్నరేళ్లుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే తెలంగాణకు ఏం చేశారో బిజెపి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధి ఆపలేరన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రైతు బంధు 11 రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతుబంధును కాపీ కొట్టారన్నారు. కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
తెరాస ప్రభుత్వం ఎలాంటి రాజకీయలాభాపేక్ష లేకుండా పేదప్రజల అభివృద్ధే ధ్యేయంగా..ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో జల్ పల్లి, తుక్కుకూడ, బడంగ్ పేట, వి•ర్ పేట మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో ఒకేరోజు రూ.400కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ సవి•పంలో ఉన్నప్పటికీ అభివృద్ధి దూరంగా ఉన్న శివారు మున్సిపాలిటీపై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశరలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం పరిధిలోని తుక్కుగూడలో సవి•కృత మార్కెట్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కూరగాయలతో పాటు మాంసం విక్రయాలకు సంబంధించి మార్కెట్లో సదుపాయాలు కల్పించనున్నారు. సవి•కృత మార్కెట్ నిర్మాణానికి 4 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.
108 గదులతో వేర్వేరుగా వెజ్, నాన్ వెజ్ బ్లాక్లను నిర్మిస్తారు. 78 గదులతో కూరగాయల బ్లాక్, 30 గదులతో మాంసాహార బ్లాక్ అందుబాటులోకి తీసుకువస్తారు. తుక్కుగూడకు మంచినీటి పైప్లైన్ నిర్మాణానికి, జల్పల్లిలో రహదారుల విస్తరణకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లాలోనే మరికొన్ని అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. జల్పల్లిలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వొస్తున్నాయని, త్వరలో జల్పల్లిలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామని, రూ.29 కోట్లతో జల్పల్లికి మరో రోడ్డు మంజూరు చేస్తామని, శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని కెటిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.