- ఆనందం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువత
- డిజిపి గౌతం సవాంగ్ ప్రకటనపై హర్షాతిరేకాలు
అమరావతి,జూలై 6 : పోలీసు శాఖలో రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన ప్రకటనతో యువత నాందం వ్యక్తంచేస్తున్నది. అలాగే నిరుద్యోగులకు ఇది వరంగా మారనుందని అంటున్నారు. ఎన్నాళ్ల నుంచో పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది శుభవార్తని కొందరు అన్నారు. వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ నుంచి ఏడాదికి 6,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భర్తీ చేస్తామని డిజిపి వెల్లడించారు. కొత్త నియామకాలపై యువత అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు. దీంతో తమకు ఉద్యోగాలు రావాలన్న ఆశలో ఉన్నారు.
మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన దాదాపు 15 వేల మంది మహిళా సురక్షా కార్యదర్శులకు మహిళా పోలీసుల •దా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వారికి కానిస్టేబుల్ తరహా విడతల వారీగా క్యాప్సుల్ శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు శిక్షణ కేంద్రంలో ఒకసారి 6,500 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉందని డీజీపీ గుర్తు చేశారు. కాబట్టి 15 వేల మంది మహిళా పోలీసులకు క్యాప్సుల్ శిక్షణ ముగిసిన తరువాత ఇతర రెగ్యులర్ పోలీసు నియామక పక్రియపై దృష్టి సారిస్తామన్నారు. 2019?20లో ఇప్పటికే 3,057 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేసి శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చుకున్నామన్నారు. ఇంకా 11,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కొందరు నిరుద్యోగుల్లో అపోహలు సృష్టించేలా అవాస్తవాలను ప్రచారం చేయడం తగదని చెప్పారు.
ఈ ప్రభుత్వం గడచిన రెండేళ్లలో మొత్తం 6,05,949 పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు. వాటిలో 1,84,264 రెగ్యులర్ ఉద్యోగాలు, కాంట్రాక్టు పద్ధతి ద్వారా 19,701 ఉద్యోగాలు, ఔట్ సౌర్సింగ్ ద్వారా 3,99,791 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,193 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 34,563 ఖాళీలు మాత్రమే భర్తీ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. అయితే డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రెస్ట్ డీజీపీ •దాలో మాట్లాడినట్లు లేదని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య అన్నారు. మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. డీజీపీ వైసీపీ ప్రతినిధిగా మాట్లాడినట్లుందని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే బాగా పనిచేస్తుందని.. వ్యాఖ్యానించడం డీజీపీకి తగదన్నారు. 15 వేల పోలీసు మహిళా రక్షకులను ఎవరు రిక్రూట్ చేశారు? అని వర్లరామయ్య ప్రశ్నించారు.పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చేసిందా లేక.. సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అధికార పార్టీ చేసిందా? అని నిలదీశారు. అన్ని విభాగాల రిక్రూట్మెంట్ గురించి.. డీజీపీ వ్యాఖ్యానించడం ఆ పదవికి తగునా? అని వర్లరామయ్య ప్రశ్నించారు.