Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌కుటుంబ నియంతృత్వ పాలన..

  • తెలంగాణలో అణచివేతపై అమిత్‌షాకు వివరించాం
  • అమిత్‌షాతో భేటీపై బండి సంజయ్‌ ‌వివరణ
  • ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతిచ్చింది.. వారిది న్యాయమైన కోరికే అన్న సంజయ్‌

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌తెలంగాణలోని పరిస్థితులు, అణిచివేత, పాదయాత్ర, కేసుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను అణిచివేస్తుందన్నారు. ఈటల రాజేందర్‌ ‌భారీ మెజార్టీతో గెలుపొందడాన్ని అమిత్‌షా అభినందించారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో మా పోరాటంపై అమిత్‌ ‌షా సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌నియంతృత్వ పాలన, అవినీతి, కుటుంబ పాలనపై పోరాటాన్ని అభినందించారు. ఇదే పంథాను కొనసాగించాలని, అవినీతిపై పోరాడాలని సూచించారు’ అని బండి సంజయ్‌ అన్నారు.

రాష్ట్రంలో మరింత ముందుకు పోవాలన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత వెంటనే ప్రారంభించాలని చెప్పారు. రెండు రోజుల పాటు యాత్రలో పాల్గొంటానని అమిత్‌షా హావి• ఇచ్చారని తెలిపారు. వరి విషయంలో సీఎం కేసీఆర్‌ ‌ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దుర్మార్గుడు, తెలంగాణలో సమస్యలను సృష్టించే పార్టీ టీఆర్‌ఎస్‌ అని, జోనల్‌ ‌వ్యవస్థతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వరిధాన్యం కొనే దమ్ము కేసీఆర్‌కి లేదని ఆయన మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వొస్తుందని ప్రశించారు. కేసీఆర్‌ ‌రాష్ట్రంలో ఎవరికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని, ప్రతి గింజ కొంటామని కేసీఆర్‌ ‌మోసం చేశారని, కేసీఆర్‌ అవినీతిపై పోరాటం చేస్తామని బండి సంజయ్‌ ‌తెలిపారు.

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతిచ్చింది..వారిది న్యాయమైన కోరికే
ఎస్సీ వర్గీకరణకు అన్ని విధాలుగా బీజేపీ మద్దతు ఇచ్చిందని బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఢిల్లీ జంతర్‌ ‌మంతర్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో బండి సంజయ్‌, ‌మంద కృష్ణ మాదిగ, ఎంపీ సోయం బాపురావు, విఠల్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నారు.

ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైన కోరిక అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మంద కృష్ణమాదిగ నేతృత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని, కేంద్రం తప్పకుండా న్యాయం చేస్తుందని బండి సంజయ్‌ ‌తెలిపారు.

Leave a Reply