- వరదలతో జనం చస్తుంటే ఉద్యాన పంటలపై సమీక్షలా?
- పలు బస్తీల్లో పర్యటించిన పిసిసి చీఫ్ ఉత్తమ్
ప్రజాతంత్ర, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. వరదలతో ప్రజలు కొట్టుకు పోతుంటే కనీసం ఆరాతీసే తీరిక కూడా సిఎంకు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఓ వైపు వర్షాలు, వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే కేసీఆర్ హర్టీకల్చర్ వి•ద రివ్యూ చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఎప్పుడు ఏం చేయాలో తెలియని సిఎం కెసిఆర్ అని అన్నారు. నగరం అతలాకుతలం అయితే ఇదేనా సవి•క్షకు సమయమని మండిపడ్డారు. ప్రజలు చస్తుంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా కెసిఆర్ తీరు ఉందని దుయ్యబట్టారు.మూడు రోజులవుతున్నా ఇండ్లలో నీటిని తోడేసే ఏర్పాట్లు చేయలేదని…కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు కూడా పనిచేయడం లేదన్నారు. గ్రేటర్ను వంద రోజుల ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని..కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పారన్నారు. హైదరాబాద్ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముందు వర్షం నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మౌలిక వసతులు కల్పించకపోవడమే నగరంలో దుస్థితికి కారణమన్నారు. వరదల మరణాలను తక్కువ చేసి చూపుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు కూడా పనిచేయడం లేదన్నారు. తాము గాంధీభవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఎంఎస్ మక్తా, సీబీఐ కాలనీలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించిన ఉత్తమ్…బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న రాచకొండ పోలీసులు