డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన జూడాలు
సమస్యలు పరిష్కరించకుంటే 28నుంచి మరింత ఉధృతం
జూడాల సమ్మెను తప్పుపట్టిన మంత్రి కెటిఆర్
తక్షణం విరమించాలని ఆదేశం..లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్,మే26:గతంలో ఇచ్చిన జీతాల పెంపు హామీ ని అమలుచేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు బుధవారం నుంచి ఆందోళన బాట పట్టారు. ఎమర్జెన్సీ, కొరోనా ఐసీయూ వార్డులు మినహా మిగతా డ్యూటీలు బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. డిమాండ్లు తీర్చకపోతే శుక్రవారం నుంచి మొత్తం సేవలు బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల పదో తేదీనే జూడాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. గతంలో ఇచ్చిన జీతాల పెంపు హావి•ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ రెసిడెంట్స్, జూనియర్ రెసిడెంట్స్కు 15 శాతం జీతాలు పెంచాలంటున్నారు. కొరోనా ఫస్ట్ వేవ్లో చెప్పినట్లుగా 10 శాతం ఇన్సెటివ్స్ వెంటనే చెల్లించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. కొరోనా బారినపడిన జూడాలు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్లో ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. జూడాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదని డీఎంఈ రమేశ్ రెడ్డి చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎంలో జూనియర్, రెసిడెంట్ డాక్టర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. అత్యవసర సేవలు మినహా ఇతర విధులను బహిష్కరిం చాలని జూడాలు నిర్ణయించారు. పెంచిన స్టైఫండ్, కొవిడ్ ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే దవాఖానాల్లో 28 నుంచి అన్ని విధులు బహిష్కరించాలని జూడాలు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. జూడాల సమ్మెకు ఇది సరైన సమయం కాదు.. వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. పెంచిన స్టైఫండ్ను వెంటనే అమలు చేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే్గ కేంద్రం కలగజేసుకోకపోవడం వల్లే టీకాల కొరత ఏర్పడిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ టీకా హబ్ అయినా గ్లోబల్ టెండర్లు పిలవాల్సి వచ్చిందన్నారు. కోటి వ్యాక్సిన్లకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు.
Next Post