- వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు
- మాల్ప్రాక్టీస్ నిరోధానికి సిసి కెమెరాలు
- సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై గట్టి నిఘా
- వివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫైనల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తమ వివరాలను బోర్డు వెబ్ సైట్ లో ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. కాగా ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ గానీ, ఏ ఇతర అధికారుల సంతకంగానీ అవసరం లేదని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. హాల్ టికెట్ పై ఎవరి సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని అధికారులకు సూచించింది. మార్చి 4వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న 9,65,839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 1,339 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణ కోసం 25,550 మంది ఇన్విజిలేటర్ల సేవలను వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. ఇకపోతే సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
మాల్ ప్రాక్టీస్కు ఏమాత్రం ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో సెంటర్కు ఒక సిట్టింగ్ స్క్వాడ్ను ప్రత్యేకంగా నియమించింది.విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సెంటర్ లొకేషన్ యాప్ను సిద్ధం చేశారు. గతేడాదే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించలేకపోయింది. ప్రస్తుతం ఈ యాప్ పని తీరును మరింత ఆధునికీకరించి అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి సెంటర్ లొకేషన్ యాప్ అని టైప్ చేసి, ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. యాప్లో హాల్టికెట్ నంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే.. విద్యార్థి ఉన్న చోటికి పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. పరీక్ష కేంద్రానికి ఏ రూట్లో ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా హాల్టికెట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు. కాలేజీ ఫీజు పూర్తిగా చెల్లించని విద్యార్థులకు ఆయా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు వారి హాల్ టికెట్లు ఇవ్వకుండా మొండికేస్తుండటం తెలిసిందే. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే యాజమాన్యాలకు చెక్ పెట్టేందుకే ఈ అవకాశాన్ని అందుబాటలోకి తెచ్చినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
నిర్దేశిత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఉదయం 8 గంటలకే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. పరీక్షల సమయం సపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. తమ పిల్లలు అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలని, తమ కాలేజీకి మంచి గుర్తింపు తీసుకురావాలనే ఆశతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇది చదువు.. అది చదువు అంటూ వారిని బలవంతం చేస్తున్నారు. కీలకమైన ఈ సమయంలో పిల్లలకు అండగా నిలవాల్సిన తల్లిదండ్రులు కూడా మార్కులు లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మార్కులు, ర్యాంకులే జీవితం కాదు. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు అండగా నిలవాలి. వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు.
గ్రేటర్ పరిధిలో 462 పరీక్షా కేంద్రాలు
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 404280 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 462 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 16 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేంద్రాలపై నిఘా ఉంచుతున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రశ్నపత్రాలను మరో రెండు మూడు రోజుల్లో స్థానికంగా ఎంపిక చేసిన పోలీస్స్టేషన్లకు తరలించి ప్రత్యేక కౌంటర్లలో భద్రపర్చనున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో 26, మేడ్చల్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 28 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 404280 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 462 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 16 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేంద్రాలపై నిఘా ఉంచుతున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రశ్నపత్రాలను మరో రెండు మూడు రోజుల్లో స్థానికంగా ఎంపిక చేసిన పోలీస్స్టేషన్లకు తరలించి ప్రత్యేక కౌంటర్లలో భద్రపర్చనున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో 26, మేడ్చల్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 28 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
మార్చి4 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు మహానగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కూడా సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు పేర్కొన్నారు. కనీసం అరగంట ముందు సెంటర్కు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని అన్నారు. సెంటర్ కనుగొనేలా బోర్డు అధికారులు యాప్ విడుదల చేయడంతో పరీక్ష కేంద్రం తెలుసుకోవడం సులువయ్యింది. కేంద్రం వివరాలు తెలుసుకొనేందుకు టీఎస్బీఐఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థి పేరు, హాల్టికెట్టు నంబరు నమోదు చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుస్తుంది.
మార్చి4 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు మహానగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కూడా సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు పేర్కొన్నారు. కనీసం అరగంట ముందు సెంటర్కు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని అన్నారు. సెంటర్ కనుగొనేలా బోర్డు అధికారులు యాప్ విడుదల చేయడంతో పరీక్ష కేంద్రం తెలుసుకోవడం సులువయ్యింది. కేంద్రం వివరాలు తెలుసుకొనేందుకు టీఎస్బీఐఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థి పేరు, హాల్టికెట్టు నంబరు నమోదు చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుస్తుంది.