Take a fresh look at your lifestyle.

పరీక్ష రాయని ఇంటర్‌ ‌విద్యార్థులు సైతం పాస్‌ ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ సర్కార్‌

‌‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ ‌పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు శుభవార్త వినిపించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్‌ ‌పరీక్షలకు హాజరుకాని 27,589 మంది విద్యార్థులను గ్రేస్‌ ‌మార్కులతో పాస్‌ ‌చేయాలని నిర్ణయం తీసుకుంది. వీరిలో మాల్‌ ‌ప్రాక్టీస్‌ ‌కమిటీ బహిష్కరించిన 338 మంది విద్యార్థులు కూడా ఉన్నారు.

కోవిడ్‌ ‌నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చిలో జరిగిన ఇంటర్‌ ‌పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ ‌పరీక్షలు నిర్వహించకుండా గ్రేస్‌ ‌మార్కులతో పాస్‌ ‌చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply