Take a fresh look at your lifestyle.

23 ‌నుంచి ఇంటర్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు ప్రకటించిన ఇంటర్‌ ‌బోర్డు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 21 : రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8‌వ తేదీ వరకు ఇంటర్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ ‌బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ‌ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్‌ ‌పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రాక్టికల్‌ ‌పరీక్షల విషయంలో ఏవైనా సందేహాలుంటే కంట్రోల్‌ ‌రూమ్‌ను సంప్రదించొచ్చని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్‌ ‌రూమ్‌ అం‌దుబాటులో ఉండనుంది.

సంప్రదించాల్సిన ఫోన్‌ ‌నంబర్‌ 040-24600110‌గగా ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ‌బోర్డు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్టియర్‌ ‌పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండియర్‌ ‌పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

Leave a Reply