కరోనా వైరస్ నిర్దారిత కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను అరికట్టేందుకు వైరస్ వ్యాప్తి చెందకుండా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను ఆదివారం నుంచి మూసివేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
దేశ సరిహద్దుల్లో మొత్తం 37 ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టులు ఉన్నాయి. వాటిలో 19 చెక్పోస్టులు శనివారం అర్ధరాత్రి వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-నేపాల్, ఇండియా-భూటాన్, ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని చెక్పోస్టులు మూతపడనున్నాయి. వీటితో పాటు నేపాల్, భూటాన్ దేశాల నుంచి విదేశీయులు దేశంలోకి రాకుండా అడ్డుకోవాలని శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటలీ, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా దేశాల్లో పర్యటించి దేశానికి వచ్చే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
Tags: Italy, Iran, China, Spain, France, Germany and Korea