తాజాగా 148 మందికి పాజిటివ్..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు క్రితం రోజు కంటే పెరిగాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 148 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్ నుంచి 151 మంది కోలుకున్నారు. కాగా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు.
జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 50 కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 14 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,73,722 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,975కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,66,012 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,735గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.