తాజాగా 2707 మందికి పాజిటివ్..ఇద్దరు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్ : రాష్ట్రంలో కొరోనా రోజువారీ కేసులు పెరిగాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 2707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 2707 కొరోనా కేసులు నమోదు కాగా..వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 1328 కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 248, రంగారెడ్డి జిల్లాలో 202 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 7,02,801 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,049కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,78,209 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగి 20,462గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.