- రాజకీయ లబ్ది కోసమే ఉప ఎన్నిక ప్లాన్
- మంత్రి హరీష్ రావు మండిపాటు
- మెదక్లో మంత్రి నిరంజన్తో కలసి ఎరువుల రేక్ పాయింట్ ప్రారంభం
మెదక్, ప్రజాతంత్ర, అగస్టు 1 : అధికార దాహం, రాజకీయ లబ్ది కోసమే కేంద్రం ఉప ఎన్నికలు తెస్తున్నదని మంత్రి హరీష్ రావు కేద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో తాము ఉప ఎన్నికలు తెస్తే.. బీజేపీ ఇప్పుడు ఎందుకు తెస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు విషయంలో చేస్తున్న ప్రయత్నాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఐటీఐఆర్ను రద్దు చేసిన కేంద్రం కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వడం లేదని, ఉపాధి హావి• పథకాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అంతకు ముందు మెదక్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో కొత్త ఎరువుల రెక్ పాయింట్ను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. మెదక్లో రెక్ పాయింట్ దశాబ్దాల కల అన్న ఆయన..రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల వాటా కేటాయించినందుకే మెదక్కు రైలు వొచ్చిందని అన్నారు.
గతంలో ఎరువుల కోసం సనత్ నగర్ వెళ్లాల్సి వొచ్చేదని, ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పిందని అన్నారు. దేశంలో రైతుల కోసం ఎక్కవ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుజరాత్లో కూడా ఇన్ని పథకాలు లేవని అన్నారు. మెదక్కు రైల్వే లైన్ తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు చూసి కర్నాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను తెలంగాణలో కలపమని కోరుతు న్నారని నిరంజన్ రెడ్డి చెప్పారు. ప్రధాని సొంత రాష్ట్రంలో ఫసల్ బీమాపథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించిన పంట కొనేందుకు కూడా కేంద్రం ఇబ్బందులు పెడు తోందని అన్నారు. మెదక్ అక్కన్న పేట రైల్వే లైన్ కోసం వందలాది లెటర్లు రాసి కొట్లాడి సాధించు కున్నామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ రూపరేఖలే మారిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వాలు మెదక్ ను నిర్లక్ష్యం చేశాయని, కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రజలు మూడోసారి కూడా టీఆర్ఎస్ కు కట్టబెడతారని కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అక్కన్నపేట రైల్వే లైన్ ను మరింత పొడగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి, కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు.