‘‘కెసిఆర్ ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. ’’
కెసిఆర్ ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. అటవీ పునరుద్ధరణ నిధి 2016 ద్వారా నిధులను వినియోగించి.2018 బి19, 2020బి21 మధ్య 3 సంవత్సరాల కాలంలో 36,53,935 ఎకరాల పోడు భూముల నుండి ఆదివాసులు, సంప్రదాయ అటవీ వాసులను ఖాళీ చేయించడం జరిగింది. దేశంలో ఖాళీ చేయించిన మొత్తం పోడు భూముల్లో 23.65% తెలంగాణలోనే వున్నాయి. పోడు భూములు ఖాళీ చేయించి,అడవులు పెంచాలనే నిబంధన ఏ చట్టంలోనూ లేదు. పైగా పోడు భూముల హక్కుల పరిశీలన పూర్తయ్యేంతవరకు ఏ అర్జీదారునీ పోడు భూముల తొలగించరాదని అటవీ హక్కుల చట్టం లోని నిబంధన 4(5) స్పష్టంగా నీరేశి స్తోంది అంతేకాక 28బి2బి2022 న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో’’పోడు భూముల పరిశీలన పూర్తయిన తర్వాత,దాని రికార్డులు తమకు సమర్పించాలని,వీటిని సుప్రీం కోర్టు పరిశీలించే వరకూ,తిరస్కరించబడిన అర్జిదారులను అటవీ భూముల నుండి తొలగించడాన్ని నిలిపి వేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంది. అయినప్పటికీ, అటవీ హక్కుల చట్టానికీ,సుప్రీంకోర్టు తీర్పుకూ వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల నుండి గెంటివేత కొనసాగుతూనే వుంది.ప్రభుత్వ తీవ్ర నిర్భందం, తప్పుడు కేసుల బనాయింపు, ఘర్షణలు కొనసాగుతూనే వున్నాయి.
అటవీ హక్కుల చట్టం అమలులోకి రాకముందే దానికి వ్యతిరేకంగా అడవుల పర్యావరణ రక్షణ పేరిట వ్యతిరేక ప్రచారం ప్రారంభమైంది. అటవీ హక్కుల పద్దతును సవాల్ చేస్తూ 2008 సంవత్సరం ప్రారంభంలోనే సుప్రీంకోర్టులో కేసులు వేశారు. కేసు విచారణలో భాగంగానే దరఖాస్తులు తిరస్కరించబడిన వారికి భూమిపై హక్కులు లేవని వాటిని అక్రమ ఆక్రమణలుగా పేర్కొని, వారిని భూముల నుండి ఖాళీ చేయించాలని 13 ఫిబ్రవరి 2019న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దేనికి వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భూముల నుండి ఖాళీ చేయించాలనే తీర్పు నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో మోడీ ప్రభుత్వం అఫీడవిట్ దాఖలు చేసింది. వోడు భూముల నుండి ఖాళీ చేయించాలని గత తీర్పును నిలుపుదల చేస్తూ 28 ఫిబ్రవరి 2019 సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. పోడు భూముల దరఖాస్తులు తిరస్కరించినప్పుడు దానికి గల కారణాలతో సహా అర్జీదారులకు తెలియజేయాలని పై కమిటీలకు అప్పులు చేసుకునే అవకాశం కల్పించాలని ,అప్పుడు తిరస్కరించిన అర్జీదారుల రికార్డు మొత్తం సుప్రీంకోర్టుకు రాష్ట్రాలు అందజేయాలనీ, ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాకుండా పోడు భూముల నుండి ఎవరిని వెళ్లగొట్ట రాదని తన తీర్పులో పేర్కొన్నది. అయితే ఇంతవరకు రాష్ట్రాలు వీరికి సంబంధించిన సమాచారం సుప్రీంకోర్టుకు అందజేయలేదు. ఇదే విషయం 17 సెప్టెంబర్ 2022న విచారణకు రాగా, దీపావళి పండుగ తర్వాత విచారణ చేపడతామని ప్రకటించింది. పోడు భూములకు హక్కు పత్రాలు లభించని వారు నేటికీ అటవీ భూముల నుండి గెంటివేత ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు.
మోడీ ప్రభుత్వం తెస్తున్న అటవీ రక్షణ నియమాలు 2022 .అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసులు సంప్రదాయ ఆదివాసేతర ప్రజలకు లభించిన హక్కులకు గ్రామసభల అనుమతి లేకుండా చేస్తాయి. పోడు భూములకు అటవీ భూములకు గ్రామ సభలతో సంబంధం ఉండదు. పోడు భూములకు చట్టబద్ధహక్కులు రద్దయి, ప్రభుత్వ దయాదాక్షిన్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. సూటిగా చెప్పాలంటే 2006 అటవీ హక్కుల నిర్వీర్యం అవుతుంది. అటవీ హక్కుల చట్టం దాని అమలు చేసే నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ,షెడ్యూల్ ప్రాంతాల చట్టాలు, పీసా చట్టం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, పునరావాస పరిహార చట్టం 2013 ద్వారా ఆదివాసులకు లభిస్తున్న హక్కులకు వ్యతిరేకమైనవి మోడీ తెస్తున్న అటవీ నియమాలు, రాష్ట్రాల హక్కులను కూడా దెబ్బతీస్తాయి. ఈ నియమాలు సూటిగా చెప్పాలంటే మోడీ తెస్తున్న అడవి సంరక్షణ నియమాలు 2022 ఆదివాసుల అటవీ హక్కులు కాలరాచి, అడవుల్ని, అటవీ భూగర్భ వనరు వనరుల్నీ కార్పోరేట్లకు ద్వారా దత్తం చేయుటకు అడవులు ,పర్యావరణం వినాశనానికి దారి తీస్తాయి.
– వేములపల్లి వెంకట్రామయ్య, AIKMS జాతీయ అధ్యక్షులు
8639873720