- నగర పోలీసుల కఠిన నిర్ణయం
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు నడుం బిగించారు. ముఖ్యంగా టూవీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతుండటంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా వాహనదారులు వినకపోవడంతో కఠిన చర్యలు తీసుకోవడానికి సైబరాబాద్ పోలీసులు సిద్ధం అయ్యారు.
హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే మూడు నెలలపాటు లైసెన్స్ను రద్దు చేస్తారు. ఒకవేళ రెండోసారి కూడా అలానే దొరికితే లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ప్రమాదాలు, హెల్మెట్ వాడకంపై విస్తృతంగా ప్రచారం చేస్తూనే నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. డ్రైవింగ్ చేస్తున్నవారితో పాటుగా వెనకాల కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.