హన్మకొండ: గ్రామాల్లో డంపింగ్యార్డ్, వైకుంఠదామం నిర్మాణాలతో పాటుగా ప్రతి ఇంటికి సోప్ ఫీట్స్ వందకు వందశాతం నిర్మాణాలు చేసిన గ్రామ పంచాయతీలకు ఐదులక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ వెల్లడిం చారు. రెండోదశ పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్తో కలసి ఎల్కతుర్తి మండలంలోని బావుపేట జిలుగుల జగన్నాథ్పూర్లో పర్యటించి నర్సరీలను డంపింగ్యార్డ్ సోప్ ఫీట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గ్రామ ప్రగతికి చేపట్టవలసిన అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు దిశ నిర్దేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు పాఠశాలల ఆవరణలో మొక్కలను ముళ్ల పొదలను తొలగించి గ్రౌండ్ను లేవలింగ్ చేయాలని అవరమైతే మొక్కలు నాటాలని ఆదేశించారు. గ్రామ నర్సరీలో నిర్దేశించిన లక్ష్యం మేరకు బ్యాగ్ ఫిల్లింగ్ ప్రక్రియాను పూర్తి చేయాలన్నారు.
డంపింగ్ యార్డ్, వైకుంఠ దామల నిర్మాణాలు గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు వందకు వంద శాతం నిర్మాణాలను పూర్తి చేసిన గ్రామ పంచాయతీలకు 5లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా పరిషత్ చైర్మెన్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం మేరకు పల్లె ప్రగతిని విజయవంతం చేయాలన్నారు. ఎన్నడూ లేనివిధంగా గ్రామాభివృద్ధికి నెల నెల నిధులు మంజూరు చేస్తున్నందున ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషిచేయాలని ఈ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం చేసి గ్రామ ప్రగతిని ముందుకు తీసుకొని వెళ్ళాలని స్థానిక ప్రజా ప్రతినిధులను కోరారు. అంగన్వాడిలో ఎక్కువమంది పిల్లను చేర్పించి ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారంగా మెనూను అమలు చేయలని అదేవిధంగా పాటశాలలో కూడా మధ్యాహ్నం భోజనంలో కూడా మెనూ అమలు చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు అప్పుడప్పుడు తనిఖీ చేయాలన్నారు. సూరారం గ్రామంలో మొక్కల పెంపకం ను పరిశీలించారు. అక్కడి నుండి జిలుగుల గ్రామంలో నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు జడ్పీ చైర్మన్తో కలిసి కలెక్టర్ ఇంకుడు గుంత పనులను ప్రారంభించారు. నర్సరీ స్మశాన వాటిక, నిర్మాణ స్థలం కోసం సేకరించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రగతి మండల ప్రత్యేక అధికారి డీఎస్ఓ, ఎంపీపీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Tags: dumping yards, Zilla Parishad Chairman, Dr Sudhir Kumar, hanmakonda, structures made GPs