“సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొలాజెన్ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా సేవంచాలి.. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. అందువల్ల దేహంలో వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.”
ఎండాకాలం, మండేకాలం వచ్చి పడుతున్నది.. మార్చి రెండో వారం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టడం మొదలుపెట్టాడు. మార్చి నెలాఖరుకు ఎండలు మరింత ముదురి రెండునెలల పాటు మనలను తాండవమాడిస్తాయి. అసలే గత ఏడాదిమొత్తం కోవిద్ 19, భారీ వర్షాలు-వరదదలతో మునిగి దిక్కుతోచని రోజులు ఎదుర్కొన్నాం., ఈ సారి వేసవి విశ్వరూపం చూపిస్తుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండాకాలంలో అనేకరుగ్మతలు మొదలవుతాయి.
పిల్లలు, వృద్ధులు, స్త్రీలు అతిజాగ్రత్త వహించాల్సిన కాలం. ఎండలకు ఉష్ణోగ్రతలు పెరిగి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలుతీసుకుంటే ఎండాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొలాజెన్ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా సేవంచాలి.. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. అందువల్ల దేహంలో వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.
ఇల్లు దాటకుండా ఉంటే కనీసం 2 లీటర్లు, బయటకు వెళ్ళేవాళ్ళు మరో లీటరు అదనంగా మంచినీళ్లు తాగాలి. అలసటగా ఉందని అనిపిస్తే తాజా పళ్ళరసాలు తీసుకోవాలి. ఎండకాలం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు, సన్ స్క్రీన్ లోషన్స్, క్యాప్..తేలికైన వదులుగా ఉన్న లేత రంగుల వస్త్రాలు ధరించాలి. ఆల్కాహాల్, కాఫీ, టీల వంటివి డీహైడ్రేషన్ కలిగిస్తాయి కనుక వేసవిలో వాటికి దూరంగా ఉండాలి. ఎండలో ఎక్కువ శ్రమతో కూడిన పనులు నివారించగైలిగితే మంచిది. అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో దాహార్తిని తీర్చే చల్లటి నీరు, నిమ్మరసం, కొబ్బరి బొండాలతో పాటు మజ్జిగ తీసుకోవడం ఎంతో మేలు. అలాగే కీరదోస, క్యారట్, బీట్రూట్ లాంటి పచ్చికూరగాయలు తినడం శ్రేయస్కరం..
రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం నీరు కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకోవాలి. ముందుగా ముఖంపై రోజ్ వాటర్ రాసుకుంటే మంచిది. చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోకుండా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా శుభ్రం చేసుకోవాలి.. వేసవిలో రెండు పూటల స్నానం చేయడం మంచిది.
ఒకప్పుడు మండే ఎండలంటే 35 డిగ్రీలు దాటాలి. అదీ మే నెలలో ఉండేవి కానీ, ఇప్పుడు మరింత ముందుగా వేసవి మొదలవుతోంది. మార్చినుంచే భానుడు మరీ మండిపడుతున్నాడు. 40-48 వరకూ డిగ్రీల వేడి మామూలై పోయింది. జీవన విధానమూ మారే ప్రకృతికి అనుగుణంగా మారక పోతే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద ఉంచాలి.
ఎండాకాలం అందరూ జాగ్రత్తగా వుండాలి. పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత వల్ల, కలుషిత నీరు, ఆహారం, శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలంలో జబ్బుపడుతూ వుంటారు. అందువల్ల పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత వల్ల, కలుషితమైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారు. వేసవి కాలం ఆనందంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఉష్ణోగ్రత పెరిగితే బయట వాతావరణం చాలా వేడిగా వుంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా వుటుంది కాబట్టి,. వడదెబ్బ తగిలే అవకాశం వారిలో ఎక్కువ. ముఖ్యంగా ఆరేళ్ళ లోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
ఎండకాలం మరింతగా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా చెమట పట్టే వాళ్లు రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు తేమ కలిగిన సబ్బులకు బదులు వేప ఔషధాలు కలిగిన సబ్బులను ఉపయోగిస్తే చెమట దుర్వాసన మాయం చేయవచ్చు. ఎండాకాలంలో సింథటిక్ వస్త్రాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. నూలు దుస్తులను ధరించడం శ్రేయస్కరం. నూనె పదార్థాలు, వేపుళ్లు, కారం, మసాలాలను వీలైనంత వరకు తగ్గించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిది. పీచు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది. అంతేగాకా చాలా సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల ఈ కాలం వంటకాల్లో ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు రావచ్చు. ఆ పొక్కులు ఇన్ఫెక్షన్తో సెగగడ్డలుగా మారవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ చీము నెత్తురు గడ్డల వల్ల నొప్పి, జ్వరం తీవ్రతరం కావచ్చు. ఒకోసారి ముక్కు నుంచి రక్తం కారవచ్చు (ఎపిస్టాక్సిస్).
చలి తగ్గి ఎండలు ముదరక ముందే ఆడే పాడే పిల్లల మీద ఆటలమ్మ దాడి చేస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే లక్షణముంది. గవద బిళ్ళలు, పొంగు, హైపటైటిస్ ‘ఎ’ కూడా ఎండాకాలం బాగా వ్యాపిస్తాయి. వీటినన్నింటినీ టీకాతో నిరోధించవచ్చు. టీకాల వల్ల వీటిని నివారించవచ్చు. ఆటలమ్మ (చికెన్ పాక్స్) టీకా ఒకటిన్నర సంవత్సరాలు నిండిన పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. 4 – 6 సంవత్సరాలకి రెండవ మోతాదు ఇవ్వాలి. మరో విషయమేమిటంటే… ఎండలు ముదిరితే కోవిడ్ వైరస్ క్షీణిస్తుందని భ్రమపడకండి. కోవిడ్ నుంచి రక్షణ కోసం సైంటిస్టులు కనుగొన్న కోవి ఫీల్డ్, కోవాక్సిన్ లు వచ్చేసాయి. 45 – 60 సంవత్సరాల మధ్య వయసులోని దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు, 60 దాటిన ప్రతి వారికి మార్చి ఒకటో తేదీ నుంచీ టీకా వేసే ప్రక్రియ ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొదలై వేగం అందుకుంటున్నది. అన్ని జాగ్రత్తలూ పాటిస్తే ఆరోగ్యం మనదే…