జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
ఆజాద్ హింద్ ఫౌజ్… భారత స్వతంత్ర సంగ్రామంలో ఓ ప్రత్యేక అధ్యాయం. ఫౌజ్ అనగానే అందరికీ గుర్తొచ్చే వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. తెల్లోడి గుండెల్లో దడ పుట్టించిన బోస్, ఫౌజ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. *గివ్ మి యువర్ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యు ఫ్రీడమ్..*యుద్ధంతోనే స్వాతంత్య్రం సాధ్యం అన్న ఉద్దేశంతో ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని నెలకొల్పడమే కాదు, తన సైన్యాన్ని పోరాటానికి సన్నద్ధం చేసేందుకు ఉద్వేగంతో ఉపన్యసించిన సందర్భంగా సుభాష్ చంద్ర బోస్ పై విధంగా అన్నారు. ఇది వినగానే ప్రతి ఒక్క సైనికుడి రోమాలూ నిక్కబొడుచుకునేవి. పౌరుషం తన్నుకొచ్చేది. ఈ ఒక్కటే కాదు, ‘స్వాతంత్య్రం ఎవరో ఇచ్చేది కాదు… ఎవరికి వాళ్లు తీసుకునేది…’ ఇలా ఆయన మాటలన్నీ ఎక్కుపెట్టిన బాణాల్లా జనంలోకి దూసుకెళ్లి సమర భేరి మోగించేవి. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
సుభాష్ చంద్రబోస్ జననం1897 జనవరి 23
మరణం1945 18ఆగస్టు.
మరణానికి కారణంవిమాన ప్రమాదం అని భావిస్తున్నారు.
నేతాజీ భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖుడు . నేతాజీ రాజకీయ పార్టీ భారత జాతీయ ఫార్వర్డ్ బ్లాక్.
పోరుబాటలో నేతాజీ
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు. బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ, జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు.
జై హింద్
ఇది వినగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది సుభాష్ చంద్రబోస్. జర్మనీలో ఇంజినీరింగ్ చదువుకుని నేతాజీ ఐఎన్ఏలో మేజర్గా పనిచేసిన జెయిన్ అల్ అబిద్ హసన్ చేసిన వందన నినాదమిది. తన సైన్యానికి భారతీయ తరహాలో వందనం కావాలని బోస్ అడిగినప్పుడు- జై హింద్ అని హసన్ సూచించారట. అలా నేతాజీ సైన్యం ఈ సెల్యూట్ చేసేదట. స్వాతంత్య్రానంతరం ఇది జాతీయ వందనంగా మారి, రాజకీయ నాయకులూ ప్రధానమంత్రులూ ఉపన్యాసం ముగింపులో జై హింద్ అని పలికేసంప్రదాయం వచ్చింది. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో చిరస్మరణీయమైన సేవలందించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్క భారతీయుడు నడుంబిగించాలి. ఇదే మనం నేతాజీ కి ఇచ్చే ఘన నివాళి.
జై హింద్.
9866776286