అమరులకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి రాజ్నాథ్ నివాళి
న్యూ దిల్లీ, డిసెంబర్ 16 : దేశ వ్యాప్తంగా విజయ్ దివస్ను ఘనంగా జరుపుకున్నారు. 50వ విజయ్ దివస్ సందర్భంగా దిల్లీలొని అమరు వీరుల స్థూపం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే 1971లో పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. ఏటా డిసెంబర్ 16న విజయ దివస్గా జరుపుకుంటాం. విజయ దివస్ సందర్భంగా బంగ్లాకు చెందిన సాయుధ బలగాలు, భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యపరాక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. మనం కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా చెప్పారు.
50వ విజయ్ దివస్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హవి•ద్..కోవింద్ను ‘గౌరవ అతిథి’ గా ఆహ్వానించారు. అలాగే రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అమరులకు నివాళి అర్పించారు. ఆనాటి యుద్ధంలో భారత్ వీరోచిత పాత్ర పోషించిందన్నారు. విజయ దివస్ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులోని వార్ మెమోరియల్ వద్ద అప్పటి యుద్ధంలో అమరులైన భారత సైనికులకు తూర్పు నావికాదళం నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో నావల్ ప్రొజెక్టస్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ పాల్గొన్నారు. వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.