*ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం
*నిరుద్యోగుల నిరసన దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు
“ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 24, 25న విద్యార్థులు దీక్ష చేస్తామంటున్నారు. వారి దీక్షకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది” అని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని జువ్వాడి గ్రేట్ నుంచి గాంధారి శివాజీ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం టీఎస్పీఎస్సీ పేపల్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతోపాటు కేటీఆరును మంత్రివర్గం నుంచి భర్తరప్ చేయాలనే డిమాండుతో గాంధారి మండల కేంద్రంలో చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబమో, బంధువులో, పార్టీ నేతల్లో ఒక్కరు కూడా ఆత్మ బలిదానం చేసుకోలేదు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు. అమరులు కలలుగన్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమే..తొమ్మిదేళ్లయినా కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో లక్షా 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పిండు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఏ త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందో.. ఆ తెలంగాణలో మళ్లీ నిరుద్యోగ ఆత్మహత్యలు చూస్తున్నాం. తెలంగాణలో ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు కడచూపు దక్కనివ్వలేదు.మానవ మృగాల్లా బీఆరేస్ నేతలు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ సమాజం మానవత్వం కోల్పోయిందా? తెలంగాణ మేధావులు ఎక్కడున్నారు? సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత నిర్బంధం చూడలేదు. ఈ నిర్బంధాల కోసమేనా మనం తెలంగాణ తెచుకున్నది? టీఎస్పీఎస్సీ లో ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారు? వందల కోట్ల రూపాయలకు లక్షలాది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారు. కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణం జరగలేదు. ఆనాడు ఇంర్మీడియట్ బోర్డు సెక్రెటరీ గా ఉన్న జనార్దన్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారు. వీరంతా కలిసి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ఆత్మహత్యలు వద్దు.. ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 24, 25న విద్యార్థులు దీక్ష చేస్తామంటున్నారు. వారి దీక్షకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలికేక వినిపించేందుకు సిద్ధం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.