సామాన్యుల నడ్డి విరుస్తున్న బిజెపి: మంత్రి కెటిఆర్ ట్వీట్
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి అనే మాట అటుంచితే తన చర్యలతో సామాన్యుల నడ్డి విరగ్గొడుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారని కెటిఆర్ నిర్మొహమాటంగా చెప్పారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నెటిజన్లకు ఓ ప్రశ్నను సంధించారు. జీడీపీ ఫుల్ఫాం ఏంటీ ..ఇది కేంద్ర ప్రభుత్వం అసాధారణ పనితీరు కారణంగా నిరంతరం పెరుగుతూ పోతుందన్నారు. జీడీపీ(గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్) అనగా స్థూల జాతీయోత్పత్తి.
ఒక దేశంలోని ఆర్థిక కార్యకలాపాల విలువను జీడీపీతో కొలుస్తారు. జీడీపీ వృద్ధి చెందుతుందంటే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అర్థం. గత ప్రభుత్వాల హయాంలో రూ. 400 ఉండే గ్యాస్ రూ. 800, రూ. 60 రూపాయలు ఉన్న పెట్రోలు రూ.100, డీజిల్ ప్రస్తుతం రూ.89, గతంలో రూ. 80 ఉన్న మంచినూనె రూ. 150 అయింది.గ్యాస్, పెట్రోల్, డీజిల్ పెరుగుదల ప్రతీ నిత్యావసర వస్తువుపై పడుతుండటంతో పేద, మధ్య తరగతి బ్రతుకులు భారమౌతున్నాయి.
అచ్ఛేదిన్ అని జనం చచ్చే దిన్ తెచ్చారని అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ హాయాంలో జీడీపీ పెంచుతామంటే దేశాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువెళతా రనుకున్నాం కానీ ఇలా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూపోతారని అనుకోలేదని అంటున్నారు