- వలసలు వీడి వచ్చే వారి రాకపై ప్రణాళిక
- క్వారంటైన్లో ఆహారం,తదితర సదుపాయాలు కల్పించాలి
- కొరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సందర్బంగా
- సిఎం జగన్ సమీక్ష
అమరావతి,మే 1 : లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేఅవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. క్వారంటైన్లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నవారి విషయంలో కూడా సరైన విధానాన్ని అనుసరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నివారణా చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు.
అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రజలను స్క్రీనింగ్ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్కు తరలించడం తదితర అంశాలపై ఆన్నతాధికారులతో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చ జరిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సక్ష చేయాలని ఆదేశించారు. వీటిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుకు సూచించారు. సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం, మందులు అందు తున్నాయా లేదా అన్నదానిపై క్వారంటైన్లో ఉన్నవారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్ నంబర్ తమ వద్ద ఉందని, కమాండ్ కంట్రోల్ నుంచి ర్యాండమ్గా కాల్చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్ కోవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్ విధిస్తామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే గుజరాత్ నుంచి విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్ శాంపిల్స్ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని అన్నారు. ఇక శ్రీకాకుళం చేరుకునేవారికి కూడా సెంటర్లు ఏర్పాటుచేసి, పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని తెలిపారు.
కోవిడ్-19 మరణాలు తగ్గించేందుకు వ్యూహం
••ష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించామని, నిన్న ఒక్కరోజే 7902 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మిలియన్కు 1919 చొప్పున పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ఆంధప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు, 79 వెరీ యాక్టివ్ క్లస్టర్లు, 68 యాక్టివ్ క్లస్టర్లు, 53 డార్మంట్ క్లస్టర్లు, 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని అధికారులు వెల్లడించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు చేశామని, మిగిలిన వారికి 2?3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. వీరిలో 4వేల మంది హైరిస్క్ ఉన్నవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే వీరికి పరీక్షలు చేసి… లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు సీఎంకు తెలిపారు. జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని, హైరిస్క్ ఉన్నవారు శ్వాసకోసతో సంబంధిత సమస్యలతోగాని, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఈ నంబర్లకు కాల్ చేస్తే.. వెంటనే వైద్యం అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. టెలిమెడిసన్, విలేజ్ క్లినిక్, పీహెచ్సీల మధ్య సరైన సమన్వయం ఉండాలన్న సీఎం జగన్ అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వైద్య వ్యవస్థగా తీర్చిదిద్దాలని, టెలీమెడిసిన్ద్వారా ప్రిస్కిప్షన్ పొందడం, అక్కడనుంచి నేరుగా విలేజ్ క్లినిక్ ద్వారా మందులు సరఫరాచేయడం జరగాలన్నారు.
రైతులకు అన్యాయం జరగరాదు
ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రి జగన్కు తెలిపారు. ఒక్క కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చ జరగగా.. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నాసరే.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదన్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని, వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించించారు. పంటలను రోడ్డుద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవని, అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదని చెప్పిన ముఖ్యమంత్రి చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాససింగ్ ఎ•-లాంట్లపై దృష్టి పెట్టాలని, వచ్చే ఏడాది.. ఈ పంటల విషయంలో మళ్లీ మార్కెటింగ్ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.