తెలంగాణ రాష్ట్రంలో కొరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమలు చేయడంలో వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో సర్కార్ ఖజానాకు భారీ ఎత్తున గండిపడింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో కోత విధిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, కొరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్న దృష్ట్యా వారికి మార్చి నెలకు సంబంధించి పూర్తి వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు శాఖలకు చెందిన ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.