Take a fresh look at your lifestyle.

ఎపిలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్

అమరావతి, జనవరి 27 : ఎపిలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్ అమలు చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్ద లో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ ‌పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశిం చారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం క్యాంప్‌ ‌కార్యాలయంలో ఆయన సక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీం జగన్‌ ‌పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్‌ ‌నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్‌ ‌ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ అధికారులను ఆదేశించారు.

మార్చి 1 నుంచి పూర్తిస్థాయలో ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్పెప్ట్‌ను రాష్ట్రంలోన అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ ‌పంపిణీ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలని ఈ సందర్బంగా సూచించారు.  ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్ ‌పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై వారి వైపునుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్‌ ‌బ్యాక్‌ ‌తీసుకుని.. వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలి.

ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. మార్చి 1 నుంచి గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా.. పిల్లలకు రాగి మాల్ట్ ‌పంపిణీ చేయాలి. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. డబ్ల్యూహెచ్‌ఓ, ‌జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదు. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలి. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విలేజ్‌ ‌క్లినిక్స్ ‌సిబ్బంది సంబంధిత సమస్యలను నివేదించగానే.. వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలన్నారు.

Leave a Reply