- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్న గవర్నర్
- డియాకు అనుమతి లేదన్న చీఫ్విప్ శ్రీకాంత్ రెడ్డి
అమరావతి,జూన్ 15: ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సమావేశాలు ఈనెల 20వ తేదీ వరకు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీడియో ప్రసంగం ద్వారా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కేవలం బడ్జెట్ ఆమోదం కోసమే ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్, సీఎం కార్యాలయాలను నిషేధిత ప్రాంతాలుగా గుర్తించారు. అనుమతి లేకుండా ఎవరనీ రానివ్వకూడదని అధికారులు నిర్ణయించారు. అసెంబ్లీ సెక్రటేరియట్ జారీ చేసే పాసులు తప్పనిసరని, ఇవి లేకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా చట్ట సభ సభ్యులు వారికి నిర్దేశిరచిన మార్గంలోనే వెళ్లాలని అధికారులు సూచించారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో నిషేధాజ్ఞల మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అసెంబ్లీ బ్జడెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. బ్జడెట్ను ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఛీప్విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
సోమవారం డియాతో మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ వారి వారి జిల్లాలలోనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని…దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. శాసనసభ, మండలి సభ్యులు మాత్రమే సభా ప్రాంగణంలోకి రావాలని కోరారు. పీఏలు, పీఎస్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దేశంలోనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ రాజ్భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారని తెలిపారు. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అసెంబ్లీ ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తారని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. సభ్యులు ఎవరైనా కోవిడ్ -19 పరీక్షలు చేయించుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఆహార పదార్థాలు ఏర్పాటు చూసే 40 మందికి ఇప్పటికే కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వచ్చిన వారితో మాత్రమే భోజనాలు తయారు చేయిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణానికి బయట టెంట్లు ఏర్పాటు చేసి భౌతికదూరం పాటించేలా భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డియాకు ఈ సెషన్లో సభకు అనుమతి లేదని… డియా కోసం విజయవాడలోని ఆర్అండ్బి భవన్లో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు.